English | Telugu

 మా నానమ్మ ఎలా వంట చేస్తోందో చూడండి...

ఇంట్లో అమ్మమ్మలు, నానమ్మలు ఉంటే ఆ ముచ్చటే వేరుంటది కదా. అంత వయసులోనూ మనవాళ్లకు, మనవరాళ్లకు వండి పెడితే వాళ్లకు ఆనందం వస్తుంది. వాళ్ళ చేతి వంట తిని మనకు ఆరోగ్యం కూడా వస్తుంది. ఐతే ఎవరింట్లో బామ్మలు ఇప్పటికీ పని చేస్తున్నారో లేదో తెలీదు కానీ విష్ణుప్రియ ఇంట్లో మాత్రం వాళ్ళ బామ్మ శ్రద్దగా వంట చేస్తూ కనిపించింది. ఆమె పనిలో మునిగిపోయేసరికి తెలియకుండా ఫోటో తీసి తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో పోస్ట్ చేసింది. "మా నానమ్మ..వయసు 79 . నాకోసం ఎంతో శ్రద్దగా, ప్రేమతో చాలా డెడికేటెడ్ గా వంట చేస్తోంది చూడండి" అని కాప్షన్ పెట్టింది. విష్ణుప్రియ ఒక యూట్యూబర్‌గా తన కెరీర్‌ ని స్టార్ట్ చేసింది.

"పోవే పోరా" షోతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ షోలో సుడిగాలి సుధీర్‌తో కలిసి ఆమె చేసిన హంగామా ఆడియన్స్ ఎవరూ మర్చిపోలేరు. ఎన్నో టీవీ షోలకు యాంకర్‌గా వ్యవహరిస్తూనే నటిగానూ బుల్లితెర ప్రేక్షకులకు బాగా దగ్గరయింది. రీసెంట్ గా రిలీజ్ ఐన "వాంటెడ్ పండుగాడు" మూవీలో ఓ హీరోయిన్ గా నటించి ఆకట్టుకుంది. ఐతే ఆమె జీవితంలో రీసెంట్ గా ఒక విషాదం చోటుచేసుకుంది. ఆమె మాతృమూర్తి కన్నుమూశారు. ఆ విషయాన్ని విష్ణు ప్రియా తన ఇన్ స్టాగ్రామ్ పేజీలో తెలిపింది. ఈ సందర్భంగా తన తల్లితో కలిసున్న ఫొటో షేర్ చేసుకుని చాలా బాధపడింది. సోషల్ మీడియాను షేక్ చేస్తూ అప్పుడప్పుడు అందాల విందు చేస్తూ ఉంటుంది. తనకు సంబంధించిన అన్ని విషయాలను షేర్ చేసుకుంటూ నిత్యం వార్తల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలుస్తుంది.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.