English | Telugu

రష్మీ కన్నీటి వీడ్కోలు... కారణం వాళ్లేనా?

స్మాల్ స్క్రీన్ మీద జబర్దస్త్ కి, ఎక్స్ట్రా జబర్దస్త్ కి ఎంత పేరుందో అందరికీ తెలుసు. ఇక ఈ షోలో కనిపించే కమెడియన్స్ కి కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. వాళ్లకు కూడా ఫాన్స్ ఉన్నారు. ఒక విధంగా చెప్పాలంటే హీరోస్ కంటే వాళ్ళకే ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఫ్యాన్ పేజెస్ కూడా ఉన్నాయి. ఐతే ఇప్పటికే చాలామంది యాంకర్స్ జడ్జెస్ ఈ షోస్ నుంచి తప్పుకున్నారు. ఇకపోతే శుక్రవారం ఎక్స్ ట్రా జబర్దస్త్ కార్యక్రమానికి యాంకర్ రష్మీ హోస్ట్ గా చేస్తోంది.

ఐతే ఈ షో హోస్ట్ గా రష్మీ వెళ్ళిపోతున్నారంటూ ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఐతే ఆమె ఎందుకు వెళ్ళిపోవాలి అనుకుంటున్నారు అనే విషయం మీద నెటిజన్స్ ఆరా తీస్తున్నారు. ఈ షోకి కాస్త రేటింగ్ తగ్గేసరికి మల్లెమాల యాజమాన్యం రెమ్యూనరేషన్ విషయంలో కోతలు పెట్టేసరికి ఈ కార్యక్రమం నుంచి బయటకు రావాలని రష్మీ డిసైడ్ అయ్యారని సమాచారం. తనకు ఎంతో మంచి పేరు తీసుకు వచ్చిన ఈ షో నుంచి ఇలా వెళ్ళిపోవడం తనకు ఏ మాత్రం ఇష్టం లేకపోయినప్పటికీ తప్పనిసరి పరిస్థితిలో వెళ్ళిపోతుందట. ఈ షో ద్వారానే కాకుండ తాను నటించిన మూవీస్ ద్వారా కూడా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న రష్మీ హోస్ట్ గా వేరే చానల్స్ లోకి ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయ్యారంటూ ఒక టాక్ వినిపిస్తోంది.

ఆల్రెడీ అనసూయ ఇప్పటికే స్మాల్ స్క్రీన్ కి బైబై చెప్పేసి బిగ్ స్క్రీన్ మీద ఆఫర్స్ మీద ఆఫర్స్ అందుకుంటోంది. పేరుకు పేరు, డబ్బుకు డబ్బు. మరి రష్మీ కూడా అనసూయ ట్రెండ్ ఫాలో అవుతున్నట్టే కనిపిస్తోంది..ఎందుకంటే అదే షో, అదే కామెడీ అంతా అదే అనేసరికి ఆడియన్స్ లో కూడా ఒక రకమైన మొనాటనీ వచ్చేస్తుంది. కాబట్టి రష్మీ కూడా తెలివిగా ఆలోచించి బిగ్ స్క్రీన్ మీద, వేరే ఛానెల్స్ లోకి వెళ్ళడానికి ట్రై చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఆల్రెడీ బలగం వేణు, సుడిగాలి సుధీర్, గెటప్ శీను ఇలాంటి వాళ్లంతా జబర్దస్త్ తో పాటుగా మిగతా చానెల్స్ లోను, మూవీస్ లోనూ మంచి పేరు తెచ్చుకున్న విషయం తెలిసింది.

Podharillu: మహా పెళ్ళికి అంతా ఫిక్స్.. చక్రిని ఆమె అర్థం చేసుకుందా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -12 లో.....మహా తన డ్రీమ్ గురించి భూషణ్ కి చెప్తుంది. డ్రీం లేదు ఏం లేదు ఫ్యామిలీ ని చూసుకుంటే సరిపోతుంది. నాకు నచ్చింది వండి పెడుతూ వెళ్ళేటప్పుడు బై చెప్పి వచ్చేటప్పుటికీ అందంగా రెడీ అయి ఉంటే చాలని చెప్పగానే వీడితో అనవసరంగా నా డ్రీమ్ గురించి చెప్పానని మహా అనుకుంటుంది. అదంతా చక్రి వింటాడు. మరొకవైపు మాధవ దగ్గరికి గాయత్రి వచ్చి.. ఈ పెళ్లి కూడా క్యాన్సిల్ అయ్యిందంట కదా అని చెప్పగానే అందరు షాక్ అవుతారు. ఏ సైలెంట్ గా ఉండు.. ఈ విషయం కన్నాకి తెలియదని మాధవ అంటాడు.

Brahmamudi: రాజ్ తీసిన యాడ్ సక్సెస్.. ధాన్యలక్ష్మి ఇచ్చిన బిగ్ ట్విస్ట్ అదే!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -911 లో..... అప్పు ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే ఒకావిడని రౌడీలు వెంబడిస్తారు. అప్పుని చూసి ఆవిడ దగ్గరికి వచ్చి.. మేడం కాపాడండి అంటుంది. రౌడీలు పోలీసులని చూసి పారిపోతారు. మేడమ్ వాళ్ళు నా నగలు దొంగతనం చెయ్యాలని వెంబడిస్తున్నారని చెప్తుంది. దాంతో వాళ్ళని పట్టుకోమని కానిస్టేబుల్ కి చెప్తుంది అప్పు. చాలా థాంక్స్ మేడమ్ అని ఆవిడ చెప్తుంది. మీరు ఎక్కడికి వెళ్ళాలి నేను డ్రాప్ చేస్తానని అప్పు అంటుంది. ఆవిడ ఇంటిముందు దింపుతుంది...

Illu illalu pillalu : ఇంగ్లీష్ టీచర్ గా సెలెక్ట్ అయిన శ్రీవల్లి బయటపడుతుందా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -349 లో..... ప్రేమ, నర్మద కలిసి డుప్లికేట్ డాక్టర్ ని తీసుకొని వచ్చి శ్రీవల్లిని భయపెడతారు. నీకు జ్వరం తగ్గింది కదా అక్క ఇక ఇంటర్వ్యూకి వెళదామని ఇద్దరు దగ్గరుండి మరి ఇంటర్వ్యూ కోసం స్కూల్ కి తీసుకొని వెళ్తారు. శ్రీవల్లి ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్లి తన సర్టిఫికెట్లు ఇస్తుంది. టెల్ మీ యువర్ సెల్ఫ్ అని ప్రిన్సిపల్ అనగానే శ్రీవల్లికి ఏం చెయ్యాలో అర్థం కాదు. అసలు మీకు ఇంగ్లీష్ వచ్చా రాదా అని ప్రిన్సిపల్ అడుగుతాడు.