English | Telugu

బాత్రూంలోనూ బిగ్ బాస్ ఆది రెడ్డికి అదే పని... నెల సంపాదన 39 లక్షలు!


బిగ్ బాస్ రివ్యూస్ చెప్పే ఆది రెడ్డి రెమ్యూనరేషన్ కళ్ళు తిరిగే రేంజ్ లో ఉంది. ఎందుకంటే ఈ నెల 39 లక్షల డబ్బు వచ్చింది. దాని వెనక ఎంత కష్టం ఉందో కూడా ఒక వీడియో చేసి తన యూట్యూబ్ ఛానల్ లో పోస్ట్ చేసాడు. బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్స్ నిద్రపోయేటప్పుడు మాత్రమే తానూ నిద్రపోయి మిగతా టైం అంతా కూడా రివ్యూస్ ఇచ్చేవాడినని చెప్పారు. అంటే గట్టిగ పడుకునేది నాలుగైదు గంటలే అని చెప్పాడు. ఈ రివ్యూస్ కోసం భార్యాపిల్లలతో మాట్లాడకుండా ఉన్న ఎన్నో రోజులు ఉన్నాయని చెప్పుకొచ్చాడు. బాత్రూంలోకి వెళ్లినా కూడా బిగ్ బాస్ లైవ్ చూస్తూనే ఉంటా. పిన్ టు పిన్ నోట్ చేసుకుని చెప్పబట్టే బిగ్ బాస్ మీద పస్సిఒన్ ని పెంచుకోబట్టే ఇంత సక్సెస్ వచ్చిందన్నాడు.

తక్కువ ఇన్కమ్ వచ్చినప్పుడు చెప్పినప్పుడు ఎక్కువ ఇన్కమ్ వచ్చినప్పుడు ఎందుకు చూపించకూడదు ఈ ఇన్కమ్ చూసాక కూడా పెయిడ్ అని ఎవరన్నా అనుకుంటే ఇంకేం చేయలేదు. ఒక వీడియో చేస్తే డబ్బులు వస్తాయని తెలుసు..అలాంటప్పుడు పెయిడ్ అని అంటే ఇంకేమన్నా మాట్లాడతాము అన్నాడు ఆదిరెడ్డి. తనకు ఏది అనిపిస్తే అదే చెప్తానన్నాడు. తనకు కొనగలిగే వాళ్ళు ఉన్నారా అన్నాడు. తానూ ఎంతో మందికి హెల్ప్ చేసినట్టు చేప్పాడు. సబ్స్క్రైబర్స్ కి చెప్పినంత మాత్రాన ఏమవుతుంది అందుకే తన శాలరీ ఎంతో చెప్పేసానన్నాడు ఆదిరెడ్డి. ఇండియా, ఆస్ట్రేలియా, అమెరికా, యూకె నుంచి చూసే వాళ్లందరికి థ్యాంక్స్ అని చెప్పాడు. అలాగే తనకు హెల్ప్ చేసిన వాళ్లకు హెల్ప్ చేస్తానని...కొత్తగా యూట్యూబ్ చానెల్స్ స్టార్ట్ చేసే వాళ్ళు ఉంటె వాళ్లకు సాయం చేస్తానని చెప్పాడు ఆది రెడ్డి.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.