English | Telugu

'అంకుల్' అని పిలుస్తూ బాడీ షేమింగ్ చేస్తున్నారా!?

నిన్నటి వరకు ట్విట్టర్ లో 'ఆంటీ' వివాదం రచ్చ చేసింది. ఇప్పుడు కొత్తగా 'అంకుల్' వివాదం తెర మీదకు వచ్చింది. దీనికి కారణం నటుడు బ్రహ్మాజీ. ఆయన ఇటీవల ఒక వెరైటీ సెల్ఫీని ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. "వాట్స్ హాపెనింగ్ " అంటూ ఒక క్వశ్చన్ కూడా రిలేటెడ్ గా పెట్టారు. దీంతో ఒక నెటిజన్ "ఏం లేదు అంకుల్" అంటూ రిప్లై ఇచ్చాడు. అసలే బ్రహ్మాజీకి కోపం చాలా తక్కువ. కానీ ఈ రిప్లైకి కొంచెం కోపం వచ్చినట్టే ఉంది.

"అంకుల్ ఏంట్రా అంకుల్... కేసు వేస్తా.. నా ఏజ్ ని, నన్ను చూసి బాడీ షేమింగ్ చేస్తున్నావా?" అంటూ సెటైర్ వేసాడు. అలాగే ఆ కామెంట్ పక్కన ఒక స్మైల్‌ ఎమోజి పెట్టేసరికి ఇది సరదాగా పెట్టిన పోస్ట్ అని అర్థమౌతోంది. ఇటీవల అనసూయని ఆంటీ అన్నందుకు కేసు పెట్టింది. ఆ టాపిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టించింది.

ఐతే ఆమెను ఆంటీ అన్నందుకు మాత్రమే కేసు వేయలేదు అన్నా!! ఆంటీ అంటూ వ్యక్తిగతంగా దూషిస్తూ మాట్లాడినందుకు కేసు వేస్తానని అన్నారు..! తోటి కళాకారులకు సహకారం ఇవ్వకుండా కామెడీ చేయడం ఏంటి బ్రహ్మాజీ అన్నా మీరు!!? అంటూ మిగతా నెటిజన్స్ కౌంటర్లు ఇస్తున్నారు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ ఒక వేదిక మీద"అలాగే మా తాతగారు బ్రహ్మాజీ" గారు అన్న డైలాగ్ ని పోస్ట్ చేశారు. ఆంటీ వివాదమే ఇంకా చల్లారలేదు, ఇప్పుడు కొత్త‌గా అంకుల్ అన్నందుకు బ్రహ్మాజీ ఫైర్ అవుతున్నారు. ఈ అంకుల్ మాట ఎంతో దూరం వెళ్తుందో వేచి చూడాలి.

Karthika Deepam2 : కాశీ అకౌంట్ లో అయిదు లక్షలు.. స్వప్న చూసి షాక్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -551 లో..... కాంచన అన్న మాటలకి శ్రీధర్ బాధపడుతాడు. తినడం మానేస్తాడు. కార్తీక్ వచ్చి నాన్న భోజనం చెయ్యమని తినిపిస్తుంటే ముద్ద దిగడం లేదురా అని ఏడుస్తాడు. ఎందుకు అమ్మ ఇవన్నీ ఇప్పుడు.. ఎప్పటిలాగే మాట్లాడుకోవచ్చు కదా అని కార్తీక్ అంటాడు. నేను కావేరి తరుపున వచ్చాను.. తను ఫోన్ చేసి భయపడుతుంటే చూడలేక వచ్చానని చెప్తుంది. దాంతో శ్రీధర్ బాధపడుతూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇక కాంచనని కార్తీక్ తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోతాడు.