ఆలియాకి అతిథులుగా జాన్వి, అనన్య, సారా!?
`గల్లీ బాయ్` (2019) వంటి ఘనవిజయం తరువాత బాలీవుడ్ స్టార్స్ రణ్ వీర్ సింగ్, ఆలియా భట్ మరోమారు జట్టుకట్టిన సంగతి తెలిసిందే. `రాకీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహాని` పేరుతో రూపొందుతున్న ఈ రొమాంటిక్ డ్రామాని ప్రముఖ దర్శకనిర్మాత కరణ్ జోహార్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ధర్మేంద్ర, జయా బచ్చన్, షబానా అజ్మీ వంటి మేటి తారలు ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో ముఖ్య పాత్రల్లో దర్శనమివ్వనున్నారు.