మూడు తరాల హీరోలకు పనిచేసిన రచయిత.. మోక్షజ్ఞకు కూడా రాయాలి!
చిరంజీవి కథానాయకుడిగా నటించిన 'సైరా.. నరసింహారెడ్డి' చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకుడు. ఆ సినిమాకు పలువురు రచయితలు.. పరుచూరి బ్రదర్స్, సత్యానంద్, భూపతి రాజా, బుర్రా సాయిమాధవ్, మధు.. ఇంతమంది పనిచేశారు. 'సైరా' చిరంజీవి డ్రీం ప్రాజెక్ట్. అందుకే దానికి ఎంత చేయగలరో అంత చేశారు ఆ రైటర్స్ అందరూ. సైరాతో చిరంజీవి పెద్ద సాహసమే చేశారు. 65 సంవత్సరాల వయసులో శారీరకంగా, మానసికంగా అంత కష్టపడ్డం చిన్న విషయం కాదు.