ఆర్యన్కు నేను డ్రగ్స్ అందజేయలేదు.. ఎన్సీబీకి చెప్పిన అనన్య!
షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్, లైగర్ హీరోయిన్ అనన్యా పాండే మధ్య జరిగిన వాట్సాప్ చాటింగ్పై ఫోకస్ పెట్టిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) గురువారం ఓసారి, శుక్రవారం మరోసారి అనన్యను విచారించింది. ఆ ఇద్దరి మధ్య జరిగిన వాట్సాప్ సంభాషణల్లో డ్రగ్స్ అందజేయడం, డ్రగ్స్ వాడటం గురించిన విషయాలు ఉన్నాయని ఎన్సీబీ తెలిపింది.