నెలల పసికందును హోటల్లో మర్చిపోయిన స్టార్ హీరో భార్య!
బాలీవుడ్ స్టార్, అంధా ధున్ హీరో ఆయుష్మాన్ ఖురానా భార్య తాహిరా కశ్యప్ ఒకసారి రెస్టారెంట్లో తన నెలల పసికందును మర్చిపోయి, భోజనం అవగానే బయటకు వెళ్లింది. ఒక ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయం వెల్లడించింది. 2012లో ఆయుష్మాన్, తాహిరాలకు మొదటి సంతానంగా విరాజ్వీర్ పుట్టాడు. కొద్ది రోజుల తర్వాత అతడిని తీసుకొని, తన ఫ్రెండ్స్తో పాటు లంచ్ చేయడానికి ఒక రెస్టారెంట్కు వెళ్లిందామె.