సేమ్ ఇయర్.. నాగ్ రి-ఎంట్రీ, చైతూ ఎంట్రీ!
తెలుగునాట స్టార్ హీరోగా రాణించిన కింగ్ నాగార్జున.. బాలీవుడ్ లోనూ తనదైన ముద్ర వేశారు. `శివ`, `ఖుదాగవా`, `ద్రోహి`, `క్రిమినల్`, `మిస్టర్ బేచారా`, `అంగారే`, `జఖ్మ్`, `అగ్నివర్ష`, `ఎల్.ఓ.సి. కార్గిల్` వంటి హిందీ చిత్రాల్లో తనదైన అభినయంతో మెప్పించారాయన. కట్ చేస్తే.. దాదాపు 19 ఏళ్ళ తరువాత నాగ్.. బాలీవుడ్ లో రి-ఎంట్రీ ఇస్తున్నారు. బిగ్ బి అమితాబ్ బచ్చన్, రణబీర్ కపూర్, ఆలియా భట్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న `బ్రహ్మాస్త్ర` చిత్రంలో ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు నాగార్జున.