English | Telugu

యంగ్ టైగర్ పాట రిలీజ్ కు రెడీ

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటుడే కాదు. మంచి సింగర్ కూడా. మొన్న వచ్చిన నాన్నకు ప్రేమతో సహా, కంత్రి, అదుర్స్, రభస సినిమాల్లో తన గొంతు సవరించాడు. లేటెస్ట్ గా ఎన్టీఆర్ పాడిన ఒక పాట రిలీజ్ కు రెడీగా ఉంది. కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ నటించిన చక్రవ్యూహ సినిమా కోసం ఒక పాటను పాడాడు ఎన్టీఆర్. కన్నడ సూపర్ స్టార్ రాజ్ కుమార్ తనయుడైన పునీత్ ఇండస్ట్రీకి వచ్చి పాతికేళ్లయింది. ఈ సందర్భంగా కాస్త స్పెషల్ గా ఉండాలని చక్రవ్యూహలో, ఎన్టీఆర్ తో పాట పాడించింది మూవీ టీం. ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ ఇస్తున్నాడు. గతంలోనే తమన్ సంగీత సారథ్యంలో, రభసలో పాడాడు ఎన్టీఆర్. దీంతో పెద్దగా ఇబ్బంది పడకుండా చక్రవ్యూహకు కూడా చెలరేగిపోయాడని సమాచారం. ఈ సినిమా ఆడియో మార్చి 8 న రిలీజ్ అవనుంది. సినిమాకు ఎన్టీఆర్ పాడిన పాట హైలెట్ గా ఉండబోతోందని ఇన్ సైడ్ టాక్..

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.