English | Telugu

సర్దార్ గబ్బర్ సింగ్ ఆడియో ఫంక్షన్ లేదా..?

సర్దార్ గబ్బర్ సింగ్ ఆడియో రిలీజ్ అమరావతిలో చాలా గ్రాండ్ గా జరగబోతోందని, దీనికి మెగా బ్రదర్స్ వస్తున్నారని వార్తలు వచ్చాయి. కానీ సర్దార్ కు అసలు ఆడియో ఫంక్షనే వద్దని మూవీ టిం అనుకుంటున్నారంటూ, కొత్త టాక్ ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతోంది. ఆడియో ఫంక్షన్ అనేది, కేవలం సినిమా ప్రచారం కోసం, జనంలోకి తీసుకెళ్లడం కోసం నిర్వహిస్తారు. సర్దార్ కు ఇప్పటికే కావాల్సినంత ప్రచారం ఉంది. సినిమా రిలీజైతే, టాక్ తో సంబంధం లేకుండా, నిర్మాతను సేఫ్ జోన్ కు చేర్చేసే మార్కెట్ పవన్ కుంది. దీంతో ఆడియో ఫంక్షన్ పెట్టినా, పెట్టకపోయినా ఒకటే అని పవన్ అనుకుంటున్నారట. అసలే డెడ్ లైన్ మీట్ అవడం కోసం కష్టాలు పడుతున్న మూవీ టీంతో ఆడియో ఫంక్షన్ పెట్టి టైం వేస్ట్ చేయించడం పవన్ అండ్ కో కు ఇష్టం లేదన్న వార్తలు వస్తున్నాయి. మరి పవన్ ఏం చేస్తారో చూడాలి.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.