English | Telugu

చికెన్ ను కుమ్మేసిన ప్రియాంక చోప్రా

బాలీవుడ్ నుంచి హాలీవుడ్ కు ఎదిగిన ప్రియాంక చోప్రా కు ఎన్నడూ ఇప్పుడు క్రేజ్ పీక్స్ లోకి చేరుకుంది. లేటెస్ట్ గా ఈ మాజీ విశ్వసుందరి, హాలీవుడ్ టాక్ షాల్లో కూడా ఇరగదీస్తోంది. చాలా మంది సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేసిన జిమ్మీ ఫాలన్ టాక్ షోకు గెస్ట్ గా వెళ్లిన ప్రియాంక, హోస్ట్ ఫాలన్ ను తనతో చికెన్ తినడంలో పోటీ పడమని ఛాలెంజ్ చేసింది. దీంతో, చికెన్ వింగ్స్ ను ఇరవై సెకన్లలో ఎవరు ఎక్కువ తింటారో, వాళ్లే గెలిచినట్టు అని పోటీ పెట్టుకుని తిన్నారు. టైం అయ్యేసరికి, ప్రియాంక ఫాలన్ కంటే ఎక్కువ ముక్కలు తిని విన్నర్ గా నిలిచింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్ లో హల్ చల్ చేస్తోంది. ప్రియాంక నటించిన జై గంగాజల్ సినిమా నిన్న రిలీజైంది. కాగా ప్రియాంక ఇప్పటికే హాలీవుడ్ లో క్వాంటికీ టీవీ సీరీస్ తో పాపులర్ అయింది. బేవాచ్ అనే సినిమాలో, ప్రియాంక విలన్ గా చేయడం విశేషం.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.