English | Telugu

AA22: కళ్లుచెదిరే ధరకి అల్లు అర్జున్ మూవీ ఓటీటీ డీల్.. బడ్జెట్ లో 60 శాతం వచ్చేసింది!

'పుష్ప-2'తో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) ఎన్నో సంచలనాలు సృష్టించాడు. ఈ మూవీ వరల్డ్ వైడ్ గా రూ.1800 కోట్ల గ్రాస్ రాబట్టి ఆల్ టైం బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అలాగే బాలీవుడ్ సినిమాలను సైతం వెనక్కి నెట్టి.. హిందీ గడ్డ మీద ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. అంతేకాదు, ఓటీటీ డీల్ పరంగానూ రికార్డు సృష్టించింది. 'పుష్ప-2' ఓటీటీ రైట్స్ ని అప్పుడు నెట్ ఫ్లెక్స్ రూ.275 కోట్లకు సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు అల్లు అర్జున్ నెక్స్ట్ ఫిల్మ్.. అంతకుమించిన సంచలనాలకు రెడీ అవుతోంది.

అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో ఓ సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ చేస్తున్నాడు. సన్ పిక్చర్స్ ఏకంగా రూ.1000 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇంత బడ్జెట్ అయినప్పటికీ.. సన్ పిక్చర్స్ లో ఎటువంటి ఆందోళన లేదు. దానికి కారణం.. కేవలం డిజిటల్ రైట్స్ ద్వారానే 60 శాతం బడ్జెట్ రికవర్ అవుతుందట. (AA22)

అల్లు అర్జున్-అట్లీ ఫిల్మ్ యొక్క అన్ని భాషల ఓటీటీ రైట్స్ కి కలిపి ఏకంగా రూ.600 కోట్లు చెల్లించడానికి నెట్ ఫ్లెక్స్ అంగీకారం తెలిపిందట. ఈ మేరకు సన్ పిక్చర్స్, నెట్ ఫ్లెక్స్ మధ్య డీల్ కుదిరినట్లు సమాచారం.

Also Read: 2025 రౌండప్.. సర్ ప్రైజ్ చేసిన కొత్త దర్శకులు.. మీ ఫేవరెట్ ఎవరు?

'పుష్ప-2' తర్వాత అల్లు అర్జున్, 'జవాన్' తర్వాత అట్లీ కలిసి చేస్తున్న సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు ఉన్నాయి. పైగా హాలీవుడ్ టెక్నీషియన్స్ వర్క్ చేస్తున్నారు. దీపికా పదుకొనే, రష్మిక మందన్న, మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ వంటి స్టార్ హీరోయిన్స్ నటిస్తున్నారు. అందుకే నెట్ ఫ్లిక్స్ డిజిటల్ రైట్స్ కోసం రూ.600 కోట్లు చెల్లించడానికి రెడీ అయినట్లు వినికిడి. ఇప్పటిదాకా ఇండియన్ సినిమాలో ఇదే హైయెస్ట్ ఓటీటీ డీల్ కావడం విశేషం.

ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలాంటి సినిమా రాలేదు.. మారుతి ఏమంటున్నాడు

రెబల్ సాబ్ ప్రభాస్(Prabhas)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై తన కట్ అవుట్ కి ఉన్న క్యాపబిలిటీని రాజాసాబ్(The Raja saab)తో మరోసారి చాటి చెప్పాడు. ఇందుకు సాక్ష్యం రాజాసాబ్ తో తొలి రోజు 112 కోట్ల గ్రాస్ ని రాబట్టడమే.  ఈ మేరకు  మేకర్స్ కూడా ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. దీంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు. చిత్ర బృందం ఈ రోజు రాజా సాబ్ కి సంబంధించిన విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. దర్శకుడు మారుతీ తో పాటు, నిర్మాత విశ్వప్రసాద్(TG Vishwa Prasad)రాజా సాబ్ హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హాజరయ్యారు.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.