English | Telugu

యన్.టి.ఆర్.స్టుడియో నిర్మాణం

యన్.టి.ఆర్.స్టుడియో నిర్మాణంలో ఉందని విశ్వసనీయవర్గాల ద్వారా అందిన సమాచారం. వివరాల్లోకి వెళితే యువ హీరో యంగ్ టైగర్ యన్.టి.ఆర్. తన తాతగారైన విశ్వవిఖ్యాతనటసార్వభౌమ నందమూరి తారక రామారావు గారి పేర ఒక స్టుడియో కడుతున్నాడట. అది హైటెక్ సిటీకి ఓ పది కిలోమీటర్ల దూరంలోనే ఉందట. జూనియర్ యన్ టి ఆర్ మామ నార్నే శ్రీనివాసరావు తన అల్లుడికి 25 ఎకరాల స్థలాన్ని కట్నం రూపంలో ఒక భాగంగా ఇచ్చారట. ప్రస్తుతం ఆ స్థలంలోనే యన్.టి.ఆర్. తాతగారి పేరు మీద స్టుడియో నిర్మాణం చేపట్టారట.

మామూలుగా రామోజీరావు, సూపర్ స్టార్ కృష్ణ, అక్కినేని నాగేశ్వరరావు, కీర్తిశేషులు యన్. టి.ఆర్., డాక్టర్ రామానాయుడు వంటి పెద్దలు మాత్రమే స్టుడియోలను హైదరాబాద్ లో నిర్మించారు. ఇప్పటివరకూ ఏ యువ హీరో కూడా స్టుడియో నిర్మాణాన్ని చేపట్టలేదు. యువ హీరోల్లో స్టుడియో అధినేత అనిపించుకునే ఘనత ఒక్క యువ హీరో యంగ్ టైగర్ యన్.టి.ఆర్.కే దక్కుతుంది. ఈ విషయం యువ హీరో యంగ్ టైగర్ యన్.టి.ఆర్.మీడియాకు ఇంకా ధృవీకరించలేదు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.