English | Telugu

నాగార్జున "రాజన్న" కథ ఇదే

నాగార్జున"రాజన్న" కథ ఇదేనని ఆయనే స్వయంగా తెలుగువన్ కి తెలియజేశారు. వివరాల్లోకి వెళితే తెలంగాణాలోని నేలకొండపల్లి అనే గ్రామంలో మల్లమ్మ ( ఏన్నీ) అనే పాపను ఆ గ్రామ ప్రజలు ప్రాణంలా చూసుకుంటారు. ఎందుకంటే ఆ పాప బ్రిటీష్ పాలకులకు వ్యతిరేకంగా పోరాడి దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత తన స్వగ్రామానికి వస్తే, అక్కడ ఇంకా స్వాతంత్ర్యం రాకపోగా, రజాకార్లు, దొరలు ప్రజలను ఏ విధంగా హింసిస్తున్నారో గమనించి, వారిలో తిరుగుబాటు వచ్చేలా చేస్తాడు.

ఆ ప్రయత్నంలో భాగంగా తన ప్రాణాలను పోగొట్టుకున్న యోధుడు "రాజన్న" కూతురే ఈ మల్లమ్మ. "రాజన్న" కూతురే మల్లమ్మ అని తెలిస్తే దొరలు చంపేస్తారని ఆ విషయం ఎవరికీ తెలియకుండా మల్లమ్మను పెంచుతూంటారు. ఆ తర్వాత మల్లమ్మ ఏం చేసిందీ, "రాజన్న" కూతురని ఎలా అనిపించుకుందీ అన్నది మిగిలిన కథ. ఈ నాగార్జున "రాజన్న" చిత్రం డిసెంబర్ 22 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతూంది.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.