Read more!

English | Telugu

అప్పుడే ఓటీటీలోకి 'విరూపాక్ష'!

సాయి ధరమ్ తేజ్, సంయుక్త మీనన్ జంటగా నటించిన చిత్రం 'విరూపాక్ష'. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకి కార్తీక్ దండు దర్శకుడు. ఏప్రిల్ 21న విడుదలైన ఈ సినిమా సాయి ధరమ్ తేజ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. 25 రోజుల్లో వరల్డ్ వైడ్ గా రూ.47 కోట్ల షేర్ రాబట్టిన ఈ చిత్రం ఇప్పటికీ విజయవంతంగా ప్రదర్శితమవుతూ పలు చోట్ల మంచి వసూళ్లు రాబడుతోంది. అయితే అనూహ్యంగా ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో విడుదలకు సిద్ధమవ్వడం ఆసక్తికరంగా మారింది.

'విరూపాక్ష' డిజిటల్ రైట్స్ ని ప్రముఖ ఓటీటీ వేదిక నెట్ ఫ్లిక్స్ దక్కించుకుంది. ఈ నెల 21 నుంచి ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. థియేటర్లలో విడుదలైన నెల రోజులకే ఈ బ్లాక్ బస్టర్ ఫిల్మ్.. ఓటీటీలోకి వస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఫుల్ రన్ లో ఈ సినిమా రూ.50 కోట్ల షేర్ మార్క్ అందుకుంటుందనే అంచనాలు ఉన్నాయి. 50 కోట్ల మార్క్ కి దగ్గరవుతున్న వేళ.. ఓటీటీలో అలరించడానికి సిద్ధమవ్వడం విశేషం. మరి ఈ సినిమాకి ఓటీటీలో కూడా అదే స్థాయి రెస్పాన్స్ వస్తుందేమో చూడాలి.