English | Telugu

విజయేంద్రప్రసాద్ డైరెక్షన్లో కార్తీ సినిమా..!

ఊపిరి సినిమాతో తెలుగులో తన మార్కెట్ కు మళ్లీ వైభవాన్ని తెచ్చుకున్నాడు కార్తీ. అమాయకత్వం, అల్లరి కలగలిపిన ఆ పాత్రతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్నాడు. తమిళ యంగ్ హీరోలందరిలోనూ, ఇప్పుడు కార్తీ మార్కెట్ మంచి రేంజ్ కు చేరుకుందనేది ఎవరూ కాదనలేని విషయం. అందుకే ఇప్పుడు రెండు భాషల్లోనూ సినిమాలు చేస్తూ, వాటిని ద్విభాషా చిత్రాలుగా రిలీజ్ చేయాలనుకుంటున్నాడు. ఇప్పటికే కాష్మోరా పేరుతో హర్రర్ మూవీ, మణిరత్నం డైరెక్షన్లో ఒక లవ్ స్టోరీ చేయాల్సి ఉండగా, ఆ తర్వాత రాజమౌళి తండ్రి, రైటర్ విజయేంద్రప్రసాద్ డైరెక్షన్లో మూవీ చేయడానికి సిద్ధమౌతున్నాడట. ఇప్పటికే కథా చర్చలు కూడా జరిగిపోయాయంటున్నారు. రైటర్ గా ఇండస్ట్రీలో చాలా సినిమాలకు పనిచేసిన విజయేంద్రప్రసాద్ కు డైరెక్షన్ పై మక్కువ ఎక్కువ. 2006 లో శ్రీకృష్ణ 2006 సినిమాతో యావరేజ్ విజయాన్ని దక్కించుకున్న ఆయన, రాజన్న సినిమాతో విమర్శకుల మెప్పును కూడా పొందారు. ప్రస్తుతం తెలుగు తమిళ కన్నడ భాషల్లో త్రిభాషా చిత్రంగా వల్లి అనే సైకలాజికల్ థ్రిల్లర్ ను తెరకెక్కించారు. వచ్చే నెలలోనే విడుదల కాబోతున్న ఈ సినిమా తర్వాత కార్తీ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. బాలీవుడ్ లో సన్నీ డియోల్ తో మేరా భారత్ మహాన్ అనే సినిమాను కూడా తెరకెక్కించడానికి రంగం సిద్ధం చేస్తున్నారు విజయేంద్రప్రసాద్. ఈ సినిమాకు క్రియేటివ్ డైరెక్టర్ గా రాజమౌళి వ్యవహరించనుండటం విశేషం.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.