English | Telugu

అమరావతి కోసం కేసీఆర్ ను కలిసిన బాలయ్య..!

ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న బాలయ్య వందో సినిమా గౌతమీ పుత్ర శాతకర్ణి. ఈ సినిమా ప్రారంభోత్సవాన్ని చాలా గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు బాలయ్య. ఇప్పటికే తన సినిమాల దర్శకులందరూ వస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. మరో వైపు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కూడా, మూవీ ఓపెనింగ్ కు పిలుస్తున్నారు. బుధవారం నాడు స్వయంగా వెళ్లి, ముహూర్తపు సన్నివేశానికి హాజరు కావాలంటూ కేసీఆర్ కు ఆహ్వాన పత్రిక ఇచ్చారు బాలకృష్ణ. కేసీఆర్ క్యాంప్ కార్యాలయంలో ఆయన్ను కలిసి అన్నపూర్ణ స్టూడియోస్ లో జరగనున్న ప్రారంభోత్సవానికి హాజరు కావాల్సిందిగా ఆయనను కోరారు. అమరావతి చరిత్ర, శాతవాహనుల పరిపాలనా కాలం నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నెల 22 న పూజా కార్యక్రమాలు నిర్వహించి షూటింగ్ ప్రారంభించబోతున్నారు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.