English | Telugu

వర్మ సర్కార్ కు సీక్వెల్ తీస్తాడట..!

రాంగోపాల్ వర్మ బాలీవుడ్ కెరీర్లో, రంగీలా తర్వాత అంత మంచి బూస్ట్ ఇచ్చిన సినిమాలు సర్కార్, సర్కార్ రాజ్. 2005 లో సర్కార్ రిలీజై భారీ హిట్ కొడితే, 2008లో సర్కార్ రాజ్ హిట్టయింది. వయసైపోయిన అమితాబ్ ను మళ్లీ యాంగ్రీ రోల్ లో చూస్తామని అభిమానులు అనుకోలేదు. కానీ వర్మ వారికి మళ్లీ పాత అమితాబ్ ను గుర్తు చేశాడు. రీసెంట్ గా తాను ఓపెన్ చేసిన కంపెనీ ఆఫీస్ కు బిగ్ బి వచ్చి చూసిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా, ఇద్దరూ సర్కార్ కు మరో సీక్వెల్ తీస్తే ఎలా ఉంటుందన్న దానిపై చర్చించారట. ఇద్దరికీ ఆ ఊహ నచ్చడంతో, త్వరలోనే సర్కార్ 3 తెరకెక్కించడానికి సిద్ధమవుతున్నారని బాలీవుడ్ వర్గాలంటున్నాయి. బిగ్ బీ తో మళ్లీ పని చేయడం తనకు చాలా ఎగ్జైంటింగ్ గా ఉందని, తన బాలీవుడ్ కమ్ బ్యాక్ అద్భుతంగా ఉంటుందని భావిస్తున్నానని వర్మ డైరెక్ట్ గా ప్రకటించేశాడు కూడా. బిగ్ బి ఉన్నప్పటికీ, సర్కార్ 3 లో అభిషేక్, ఐశ్వర్య మాత్రం ఉండరట. క్యాస్టింగ్ ను త్వరలోనే అనౌన్స్ చేసే అవకాశం ఉంది. మొత్తానికి వర్మ బాలీవుడ్ లో పెద్ద చేపనే పట్టేశాడన్నమాట. మరి రీఎంట్రీ ఎలా ఉంటుందో చూడాలి.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.