English | Telugu
ముచ్చటగా మూడోసారి వెంకటేశ్, నయనతార
Updated : Oct 30, 2015
విక్టరీ వెంకటేశ్, నయనతారల క్రేజీ కాంబినేషన్ మళ్లీ ప్రేక్షకుల ముందుకు రానుంది. గతంలో లక్ష్మీ, తులసి సినిమాలో నటించిన ఈ జంట.. ఇప్పుడు మళ్లీ మరో సినిమాలో నటించనున్నారు. చిన్న సినిమాల దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న మారుతి ఈ సినిమాకి దర్శకత్వం వహించనుండగా..హారిక హాసిని చినబాబు నిర్మాతగా వ్యవహరించనున్నారు. అయితే గతంలోనే మారుతి విక్టరీ కోసం ఓ కథను తయారు చేయగా అది కాస్త మిస్ అయింది. అయితే ఇప్పుడు మరింత కసిగా వెంకీతో సినిమా తీయాలని పట్టుబట్టి వెంకీకి ఫర్పెక్ట్ గా సూటయ్యే కథను తయారుచేశాడు. డిసెంబర్ నుండి ఈ సినిమా షూటింగ్ ప్రారంభంకానుంది. ప్రస్తుతానికి హారిక హాసిని చినబాబు త్రివిక్రమ్ –నితిన్, చందు మొండేటి - నాగచైతన్యలతో సినిమాలు నిర్మిస్తుండగా.. ఇప్పుడు ఇది ముడో చిత్రం అవుతుంది.