English | Telugu

విక్రమ్ "వీడింతే" ఆడియో రిలీజ్

పి.వి.పి.సినిమా పతాకంపై, పరమ్ వి.పొట్లూరి సమర్పణలో, చియాన్ విక్రమ్ హీరోగా, దీక్షాసేథ్ హీరోయిన్ గా, కళా తపస్వి డాక్టర్ కె.విశ్వనాథ్ ఒక ముఖ్య పాత్రలో నటించగా, రీమాసేన్, శ్రియ శరణ్, సలోనీ కొన్ని పాటల్లో నటించగా, "నా పేరే శివ" ఫేం సుసీంద్రన్ దర్శకత్వంలో, ప్రసాద్ వి.పొట్లూరి నిర్మిస్తున్న చిత్రం" వీడింతే". క్యాప్షన్ "బై బర్త్" అని నిర్ణయించారు. ఈ చిత్రాన్ని నిజానికి తెలుగు, తమిళ భాషల్లో నిర్మిస్తున్నారు. తమిళంలో ఈ చిత్రానికి "రాజ పాట్టై"అన్న పేరుతో విడుదల చేస్తారు.

డిసెంబర్ 7 వ తేదీన, హైదరాబాద్ తాజ్ డక్కన్ లో, ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్ చేతుల మీదుగా తొలి సి.డి.ని మరో ప్రముఖ దర్శకుడు రాజమౌళి అందుకోగా, యువన్ శంకర్ రాజా సంగీతం అందించిన ఈ చిత్రం ఆడియో వేల్ రికార్డ్స్ ద్వారా మార్కెట్లోకి విడుదల చేయబడింది.

ఈ "వీడింతే" ఆడియో విడుదల వేడుకకు ఈ చిత్రం యునిట్ తో పాటు ప్రముఖ నిర్మాత సురేష్ బాబు, దర్శకుడు క్రిష్, హీరోయిన్ దీక్షా సేథ్, నటి సలోని, ప్రముఖ బాట్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల, వేల్ రికార్డ్స్ అధినేత్రి శ్రీవల్లి, ప్రముఖ సంగీత దర్శకులు కీరవాణి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆంజనేయులు, ఆనంద్ అనే ఇద్దరు నిరు పేద సీనియర్ సినీ విలేఖరులకు ఈ చిత్ర నిర్మాత ప్రసాద్.వి. పొట్లూరి ఒక్కొక్కరికీ 25 వేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయాన్ని అందించారు.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.