English | Telugu

పవన్ ఫ్యాన్స్ మీద యన్ టి ఆర్ ఫ్యాన్స్ ఆగ్రహం

పవన్ ఫ్యాన్స్ మీద యన్ టి ఆర్ ఫ్యాన్స్ ఆగ్రహంగా ఉన్నారు. వివరాల్లోకి వెళితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన "పంజా" చిత్రం త్వరలో విడుదల కాబోతూంది. ఈ చిత్రం కోసం నల్గొండ జిల్లాలోని కోదాడలో పవన్ కళ్యాణ్ అభిమానులు ఒక ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు...అందుకు ఎవరికీ అభ్యంతరం లేదు. కానీ ఆ ఫ్లెక్సీ మీద " తాతల చరిత్ర చెప్పుకునే అలవాటు లేదు. మేము సృష్టించిన చరిత్రే భావి తరాలకు భగవద్గీత" అన్న కొటేషన్ వ్రాసి ఉంది.

ఇది జూనియర్ యన్ టి ఆర్ ని ఉద్దేశించే వ్రాశారని ఆయన అభిమానులు ఆగ్రహంగా ఉన్నారు. అంతటితో ఆగకుండా ఆ కొటేషన్ ఉన్న ఆ ఫ్లెక్సీని తీసేయాలని వారు డిమాండ్ చేశారు. ఆ కోటేషన్ ని తీయటానికి వారు అంగీకరించినా, ఆ ఫ్లెక్సీని తీయటానికి మాత్రం పవన్ ఫ్యాన్స్ అంగీకరించలేదు. మొన్నీమధ్యే మహేష్ బాబు ఫ్యాన్స్ కీ, రామ్ చరణ్ అభిమానులకీ మధ్య రికార్డుల గొడవ జరగిన విషయం ప్రేక్షకులకు తెలిసిందే. మళ్ళీ ఈ ఫ్లెక్సీల గొడవ మొదలయింది. అభిమానం హద్దులు దాటితే ఇలాగే ఉంటుంది మరి.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.