English | Telugu

దీక్షా సేథ్ ని ర్యాగింగ్ చేసిన విక్రమ్

హీరోయిన్ దిక్షా సేథ్ తొలి సారిగా ఒక తమిళ చిత్రంలో నటిస్తూంది. ఆ చిత్రం ఏమిటంటే పి.వి.పి.సినిమా పతాకంపై, పరమ్ వి.పొట్లూరి సమర్పణలో, చియాన్ విక్రమ్ హీరోగా, దీక్షాసేథ్ హీరోయిన్ గా, కళా తపస్వి డాక్టర్ కె.విశ్వనాథ్ ఒక ముఖ్య పాత్రలో నటించగా, రీమాసేన్, శ్రియ శరణ్, సలోనీ కొన్ని పాటల్లో నటించగా, "నా పేరే శివ" ఫేం సుసీంద్రన్ దర్శకత్వంలో, ప్రసాద్ వి.పొట్లూరి నిర్మిస్తున్న చిత్రం" వీడింతే.

డిసెంబర్ 7 వ తేదీన, హైదరాబాద్ తాజ్ డక్కన్ లో, ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్ చేతుల మీదుగా తొలి సి.డి.ని మరో ప్రముఖ దర్శకుడు రాజమౌళి అందుకోగా, యువన్ శంకర్ రాజా సంగీతం అందించిన ఈ చిత్రం ఆడియో వేల్ రికార్డ్స్ ద్వారా మార్కెట్లోకి విడుదల చేయబడింది.

ఈ "వీడింతే" ఆడియో విడుదల వేడుకలో హీరో విక్రమ్ ప్రసంగిస్తూ దిక్షా సేథ్ తొలిసారిగా తమిళ చిత్రంలో నటించటం వల్ల ఆమెను తమ చిత్రం యూనిట్ అంతా ర్యాగింగ్ చేశారనీ, అయినా ఆమె చాలా కూల్ గా అవేవీ పట్టించుకోకుండా తన నటన మీదే ఏకాగ్రత చూపించటం తనకెంతో నచ్చిందనీ అన్నారు.

ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలాంటి సినిమా రాలేదు.. మారుతి ఏమంటున్నాడు

రెబల్ సాబ్ ప్రభాస్(Prabhas)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై తన కట్ అవుట్ కి ఉన్న క్యాపబిలిటీని రాజాసాబ్(The Raja saab)తో మరోసారి చాటి చెప్పాడు. ఇందుకు సాక్ష్యం రాజాసాబ్ తో తొలి రోజు 112 కోట్ల గ్రాస్ ని రాబట్టడమే.  ఈ మేరకు  మేకర్స్ కూడా ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. దీంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు. చిత్ర బృందం ఈ రోజు రాజా సాబ్ కి సంబంధించిన విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. దర్శకుడు మారుతీ తో పాటు, నిర్మాత విశ్వప్రసాద్(TG Vishwa Prasad)రాజా సాబ్ హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హాజరయ్యారు.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.