English | Telugu

వరుణ్ తేజ్ సినిమాల్లోకి అందుకే వచ్చాడట..!

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సినిమాల్లోకి రావడం వెనుక ఒక వ్యక్తి కారణమట. ఆ వ్యక్తి చెప్పిన కారణంగానే సినిమాలపై ఇష్టం పెరిగిందట. ఇంతకూ ఆ వ్యక్తి ఎవరు అనేదేగా మీ డౌట్. ఇంకెవరు..మెగాస్టార్ చిరంజీవే. చిరంజీవి వరుణ్ ను సరదాగా ఫోటోలు తీస్తూ, అతనిది ఫోటోజనిక్ ఫేస్ అని సినిమాల్లోకి వెళ్లమని ఖచ్చితంగా చెప్పారట. అప్పటి వరకూ సినిమాల మీద పెద్ద ఆసక్తి లేని వరుణ్ అసలు సినిమాల్లోకి రాకూడదనుకున్నాడట. కానీ ఆ తర్వాతి నుంచే సినిమాల కోసం శిక్షణ తీసుకోవడం మొదలెట్టాడు. ప్రస్తుతం స్క్రిప్ట్ సెలక్షన్ నుంచి, సినిమా తెరకెక్కిన తర్వాతి వరకూ, ప్రతీ డిపార్ట్ మెంట్ మీదా గ్రిప్ ఉండేలా చూసుకుంటున్నాడు వరుణ్. కెరీర్ ను చాలా పెర్ఫెక్ట్ ప్లాన్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఇప్పటికే వరుణ్ నటించిన కంచె సినిమా ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా జాతీయ అవార్డును గెలుచుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కే కాలేజ్ లవ్ స్టోరీ నటిస్తున్నాడు మెగా ప్రిన్స్..

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.