English | Telugu

ఇళయరాజా పై సొంత తమ్ముడి విమర్శలు..!

భారతీయులందరూ గర్వించే సంగీత దర్శకుల్లో అగ్రగణ్యుడు ఇళయరాజా. ఆయన గురించి పాజిటివ్ గానే తప్ప, నెగటివ్ గా ఎప్పుడూ ఈ వార్తా రాదు. అంతటి సౌమ్యుడు. కానీ రీసెంట్ గా ఆయన తమ్ముడు గంగై అమరన్ రాజామీద విమర్శలు చేయడం చర్చనీయాంశమైంది. విషయంలోకి వెళ్తే, తమిళ సినిమా తారై తాపట్టై సినిమాకు ఇళయరాజాకు ఉత్తమ నేపథ్య సంగీత దర్శకుడు అంటూ జాతీయఅవార్డు ప్రకటించారు. ఐతే ఇళయరాజా మాత్రం, పాటలు వేరు, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ వేరు అంటూ అవార్డులు ఇవ్వడం కరెక్ట్ కాదని, తనకు బ్యాగ్రౌండ్ మ్యూజిక్ మాత్రమే అవార్డు ఇస్తే అవమానంగా భావిస్తున్నానని ఆవేదన వ్యక్తం చేసి, తనకు అవార్డు వద్దంటూ తిరస్కరించారు.

ఇదే విషయంపై ఆయన మీద తమ్ముడు గంగై అమరన్ తీవ్ర విమర్శలు గుప్పించారు. జాతీయ పురస్కారం వచ్చిందని తమిళులందరూ ఆనందపడుతుంటే, అవార్డును తిరస్కరించి అందరి మనోభావాలను రాజా దెబ్బతీశారని, అందరూ తలదించుకునేలా చేశారని విమర్శించారు. సినిమాలో పాటలు అవార్డులు ఇవ్వాల్సినంత గొప్పగా లేవని, అందుకే బ్యాగ్రౌండ్ కు మాత్రమే అవార్డ్ వచ్చిందని ఆయన అన్నారు. గత కొంత కాలంగా, అన్నదమ్ములిద్దరికీ మధ్య సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. అగ్ర సంగీతదర్శకుడి సొంత తమ్ముడే తూలనాడటం, తమిళనాట చర్చనీయాంశంగా మారింది.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.