English | Telugu

ఆ మూవీలో చేసిన హీరో, హీరోయిన్ రియల్ గానే చనిపోయారు.. అభిమానుల కన్నీళ్లు


-ఎందుకు ఆ హీరో, హీరోయిన్ చనిపోయారు
-మరో హీరోయిన్ నిద్రమాత్రలు మింగింది
-కారణాలు ఏంటి!
-ఇంతకీ ఆ సినిమా ఏంటి

సినిమా..అలసిపోయిన మనిషి శరీరానికి, మెదడుకి సరికొత్త నూతనోత్సాహాన్ని ఇవ్వడంతో పాటు టన్నుల క్యాలరీల కొద్దీ శక్తీ ఇస్తుంది. సదరు శక్తీ మనిషికి సరికొత్త జన్మని ప్రసాదించినట్టే అవుతుందనే నానుడి కూడా ఎప్పట్నుంచో ఉంది. మూవీ లవర్స్ కి ఆ ఈక్వెషన్ గురించి బాగా తెలుసు. కాకపోతే పైన చెప్పుకున్నవన్నీ మనకి దక్కడానికి 24 క్రాఫ్ట్స్ పడే కష్టం మన ఊహకి కూడా అందదు .ముఖ్యంగా హీరో, హీరోయిన్ తమ అభిమాన గణాన్ని అలరించాలనే ఉద్దేశ్యంలో నిద్రాహారాలు మాని సినిమా బాగా రావడం కోసం కష్టపడతారు.అలాంటి ఒక సినిమా అభిమానులకి చేదు జ్ఞాపకాన్ని మిగిల్చింది. ఆ సినిమాలో చేసిన హీరో ఊహించని విధంగా ఆత్మహత్య చేసుకొని చనిపోతే హీరోయిన్ అనుమానాస్పద స్థితిలో మరణించింది. మరో హీరోయిన్ కూడా ఆత్మహత్యాయత్నం చేసింది. మరి ఆ సినిమా ఏంటో చూద్దాం.

కలుసుకోవాలని(Kalusukovalani).. 2002 ఫిబ్రవరి 8 న థియేటర్స్ లో అడుగుపెట్టింది. అంటే నిన్నటికి ఇరవై నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఉదయ్ కిరణ్(Uday Kiran), గజాల(Gajala), ప్రత్యూష(Prathyusha)జంటగా చెయ్యగా రఘురాజ్(Raghuraj) దర్శకత్వంలో దిల్ రాజు, గిరి, ప్రవీణ్ నిర్మించారు. రొమాంటిక్ కామెడీ గా తెరకెక్కిన కలుసుకోవాలని మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. చిత్రం, నువ్వు నేను, మనసంతా నువ్వే వంటి వరుస బ్లాక్ బస్టర్స్ తర్వాత ఉదయ్ కిరణ్ నుంచి వచ్చిన మూవీ. ఈ చిత్రం కూడా గత మూడు చిత్రాల లాగానే ఘన విజయాన్ని అందుకుంది. దేవిశ్రీ ప్రసాద్ అందించిన సాంగ్స్ అతి పెద్ద అసెట్. 2014 లో ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. బయట రకరకాల కారణాలు వినిపిస్తున్నా అసలు విషయం ఆత్మ హత్య చేసుకున్న ఉదయ్ కిరణ్ కే తెలియాలి.


Also read: మోక్షజ్ఞ సినిమా పరిస్థితి ఏంటి.. అనిల్ రావిపూడితో చేస్తే ఎలా ఉంటుంది!

ప్రత్యూష కలుసుకోవాలని వచ్చిన రెండు వారాలకే మరణించింది. ఆమె మరణం ఇప్పటికీ మిస్టరీనే. మరో హీరోయి గజాల కూడా నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య యత్నం చేసింది. సరైన సమయానికి ఆమె స్నేహితులు వచ్చి కాపాడటంతో ప్రాణాలతో బయటపడింది. ఈ విధంగా కలుసుకోవాలని మూవీ ఇప్పుడు వైరల్ గా మారింది. వాలైంటెన్స్ డే కానుకగా ఫిబ్రవరి 14 న మనసంతా నువ్వే రీ రిలీజ్ అవుతున్న సందర్భంగా ఉదయ్ కిరణ్ సినిమాల గురించి ప్రస్తావనకి రావడం కూడా ఇందుకు ఒక కారణం.

Allu arjun: అల్లు అర్జున్ పై కావేరి కీలక వ్యాఖ్యలు.. నమ్మొచ్చా ఆ మాటలు 

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun)ప్రస్తుతం 'అట్లీ'(Atlee)దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. సదరు చిత్రంలోని అల్లు అర్జున్ నట విన్యాసాన్ని చూడాలంటే  నెక్స్ట్ ఇయర్ వరకు ఆగాల్సిందే. అల్లు అర్జున్ సినిమాల పరంగానే కాకుండా యాడ్స్ లోను తనదైన మెస్మరైజ్ ని చూపిస్తూ అభిమానులని, కస్టమర్స్ ని ఆకర్షిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. ఈ యాడ్స్ విషయంలో అల్లు అర్జున్ గురించి  రాయల్ ఎన్ ఫీల్డ్  బ్రాండ్ స్ట్రాటజీ విభాగం మేనేజర్ 'కావేరి బారువా'(kaveri Baruah) చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. మరి ఆమె ఏం మాట్లాడిందో చూద్దాం.