English | Telugu

చుక్క‌లు చూపిస్తున్న త్రివిక్ర‌మ్‌

త్రివిక్ర‌మ్ అంటే ఛ‌మ‌క్కులే కాదు, చుక్క‌లు కూడా చూపించ‌గ‌ల‌డ‌ని నిరూపించుకొన్నాడు. అంద‌రు ద‌ర్శ‌కుల్లానే.. నిర్మాత‌తో చెడుగుడు ఆడుకొంటున్నాడు. ఆయ‌న ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న చిత్రం అ.ఆ. నితిన్‌, స‌మంత జంట‌గా న‌టిస్తున్నారు. ఈ చిత్రానికి రాధాకృష్ణ నిర్మాత‌. ఆయ‌న‌తో త్రివిక్ర‌మ్‌కి మంచి సాన్నిహిత్య‌మే ఉంది. ఇప్పుడు ఏమైందో.. నిర్మాత‌కు మాత్రం చుక్క‌లు చూపిస్తున్నాడ‌ట‌.

అ.ఆ మొద‌లై రెండు నెల‌లు కావొస్తున్నా, షూటింగ్ మాత్రం ఎక్క‌డ వేసి గొంగ‌ళి అక్క‌డే అన్న చందాన మారింద‌ట‌. రోజుకి రెండు మూడు షాట్స్ క‌న్నా ఎక్కువ చేయ‌డం లేద‌ట‌. త్రివిక్ర‌మ్ మూడ్ బాగున్న రోజున షూటింగ్ స‌జావుగా సాగుతోంద‌ని, లేదంటే పేక‌ప్ చెప్పేసి వెళ్లిపోతున్నాడ‌ని టాక్‌. లొకేష‌న్లో త్రివిక్రమ్ ఆల‌స్యంగా వ‌స్తున్నాడ‌ట‌. ఆయ‌న వ‌చ్చేలోగా అసిస్టెంట్ డైరెక్ట‌ర్లు షాట్ రెడీ చేస్తున్నార‌ట‌. త్రివిక్ర‌మ్ వ‌చ్చి సీన్ పేప‌ర్ ఇచ్చేంత వ‌ర‌కూ ఎదురుచూపులు త‌ప్ప‌డం లేద‌ట‌. తీరా త్రివిక్ర‌మ్ వ‌చ్చాక‌.. సెట్లో అది బాలేదు, ఇది బాలేదు అని అలిగి వెళ్లిపోతున్నాడ‌ట‌. ఈ బాధ భ‌రించ‌లేకే..ఆర్ట్ డైరెక్ట‌ర్ ఈ సినిమాని వ‌దిలేసి వెళ్లిపోయాడ‌ని, మ‌రో ఆర్ట్ డైరెక్ట‌ర్‌ని తెచ్చుకొన్నాడ‌ని తెలుస్తోంది.

ఒక‌రోజు షూటింగ్ అర్థాంత‌రంగా ఆగిపోతే నిర్మాత‌ల‌కు ల‌క్ష‌ల్లో న‌ష్టాలొస్తాయి. అయినా స‌రే... రాధాకృష్ణ అన్నీ మౌనంగా భ‌రిస్తున్నాడ‌ట‌. నితిన్ కూడా పైకి ఏమీ అన‌క‌పోయినా, లోలోప‌ల చాలా ఇబ్బంది ప‌డున్నాడ‌ని టాక్. మ‌రి త్రివిక్ర‌మ్‌కి ఏమైందో.. ఎప్పుడు మార‌తాడో, ఎప్పుడు లైన్లోకొస్తాడో...??

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.