English | Telugu

ట్రైలర్ రివ్యూ : భయపెడుతున్న త్రిష నాయకి..!

కెరీర్ చివర్లో ఉన్న త్రిష, నాయకి తో మళ్లీ కెరీర్ ను నిర్మించుకోవాలనుకుంటోంది. ఇప్పటికే అవకాశాలు డ్రై అయిపోయిన ఈ చెన్నై చిన్నది, ఇక నుంచైనా మళ్లీ కెరీర్ ట్రాక్ లో పడుతుందని ఆశిస్తోంది. గోవి దర్శకత్వంలో, గిరిధర్ ప్రొడక్షన్ హౌస్ బ్యానర్ పై గిరిధర్ నిర్మిస్తున్నారు. తెలుగులో నాయకిగా, తమిళంలో నాయగిగా త్రిష భయపెట్టడానికి రెడీ అవుతోంది. నిన్న జరిగిన ఆడియో రిలీజ్ ఫంక్షన్లో, సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు మూవీ టీం. అందంతో పాటు, భయాన్ని కూడా కలిగిస్తూ, రెండు షేడ్స్ ఉన్న పాత్రలో త్రిష నటించింది. ప్రతీ ఊరికి ఒక రహస్యం ఉంటుంది. ప్రతీ ఇంటికీ ఒక కథ ఉంటుంది అనే లైన్స్ తో ట్రైలర్ మొదలవుతుంది. తన ఫ్యామిలీతో సహా ఆ ఇంటిలో దిగిన సత్యం రాజేష్ ను దెయ్యం ఇబ్బంది పెడుతుందని ట్రైలర్ బట్టి అర్ధం చేసుకోవచ్చు. మధ్య మధ్యలో బ్రహ్మీ ఫన్నీ ఎక్స్ ప్రెషన్స్, దెయ్యంగా త్రిష డైలాగ్, కట్ షాట్స్ లో సినిమాలోని క్యారెక్టర్స్ అన్నింటినీ పరిచయం చేస్తూ ట్రైలర్ ను కట్ చేశారు. ఓవరాల్ గా ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. త్రిష కెరీర్లోనే మంచి గుర్తింపు తెచ్చే సినిమా అవుతుందంటూ మూవీ టీం చెబుతున్నారు. రఘు కుంచే అందించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా ఆకట్టుకుంటోంది. సత్యం రాజేష్, గణేష్ వెంట్రామన్, సుష్మ రాజ్, కోవై సరళ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.