English | Telugu

భారీగానే ప్లాన్ చేస్తున్న బన్నీ సరైనోడు..!

బోయపాటి డైరెక్షన్లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సరైనోడుగా వస్తున్న సంగతి తెలిసిందే. బన్నీ కెరీర్లోనే భారీ అంచనాల మధ్య, భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ, భారీ రిలీజ్ కు పూనుకుంటోంది. మళయాళంతో కలుపుకుని, ప్రపంచవ్యాప్తంగా 2 వేల థియేటర్లలో సరైనోడు రిలీజవుతున్నాడని అంచనా వేస్తున్నారు. క్లాస్ కు తప్ప మాస్ సినిమాలకు స్థానం ఇవ్వని ఓవర్సీస్ లో కూడా 160 కు పైగా లొకేషన్స్ లో ఈ మూవీని రిలీజ్ చేయబోతున్నారట. బన్నీకి ఉన్న స్టైలిష్ స్టార్ ఇమేజ్, యుఎస్ మార్కెట్ లో జనాన్ని రప్పిస్తుందని అల్లు అరవింద్ భావిస్తున్నారు. ఆల్ మోస్ట్ అన్ని సెంటర్లలోనూ ప్రీమియర్ షోలు పడబోతున్నాయి. సర్దార్ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని, సినిమా టాక్ బయటికి వచ్చే లోపే, భారీగా కలెక్షన్లు కుమ్ముకోవచ్చనేది ప్రీమియర్ షోల వెనుక ఆలోచన. యుఎస్ లో ప్రీమియర్ షో టిక్కెట్ ధర 25 డాలర్ల వరకూ ఉందని సమాచారం. సినిమాకు కాస్త టాక్ అటూ ఇటూ అయినా, ఈ ప్రీమియర్ షోల పుణ్యమా అని కలెక్షన్ పరంగా ఫస్ట్ డే సేవ్ అవుతారు. ఒక వేళ పాజిటివ్ టాక్ వస్తే, ఇవే షోలు యాడెడ్ ప్లస్ గా మారతాయి. అల్లు అర్జున్ కెరీర్లోనే రికార్డ్ స్థాయిలో ప్రీమియర్ షోలు సరైనోడుకి పడటం విశేషం.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.