English | Telugu

నా మావయ్యకి సాటిలేరంటున్న మేనల్లుడు..!

మనం..సోగ్గాడే చిన్నినాయనా..ఊపిరి తదితర సినిమాలతో హిట్‌లు కొట్టిన కింగ్ నాగార్జునను ప్రేక్షకుల నుంచి ప్రముఖుల వరకు అందరూ ఆకాశంలోకి ఎత్తెస్తున్నారు. ఈ జాబితాలోకి నాగ్ మేనల్లుడు సుశాంత్ చేరాడు. తాజాగా ఊపిరి విజయోత్సవ వేడుకలో సుశాంత్ మావయ్య నాగార్జునను పొగడ్తలతో తడిపి ముద్ద చేశాడు.

అలనాటి గీతాంజలి నుంచి ఊపిరి వరకు నాగ్ టచ్ చేయని జోనర్ లేదని..ఏ సినిమా తీసుకున్నా దానికి తగ్గట్టు ప్రత్యేకంగా ఉండేలా ఉండడం తన మావయ్యకే సాధ్యమైందని, మావయ్య లాంటి వర్సటైల్ యాక్టర్ మరొకరు లేరని ఇలాంటి నటుడు దొరకడం ఇండస్ట్రీ చేసుకున్న అదృష్టమన్నారు. తన లాంటి యువనటులకు కింగ్ ఎప్పుడూ స్పూర్తిగా ఉంటాడని, తాతగారి పేరును నిలబెడుతూ, తనదైన స్టైల్లో దూసుకుపోతున్నారని కొనియాడారు. ఊపిరి లాంటి సినిమాలో నటించాలంటే ఒక సూపర్ స్టార్ ఆలోచిస్తాడని కానీ మావయ్య మాత్రం అలాంటి ఆలోచన పెట్టుకోకుండా పాత్రలో ఒదిగిపోయారని మన్మథుడిపై ప్రశంసల జల్లు కురిపించారు సుశాంత్.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.