English | Telugu

కాజల్ కు సౌత్ వాళ్లే ఇష్టమట..!

అందాల చందమామ కాజల్ గత పదేళ్లుగా తెలుగు ఇండస్ట్రీని ఏలుతోంది. బ్రేక్ వచ్చింది మగథీరతోనే ఐనా, అంతకు ముందు చందమామ సినిమాతో అందరి దృష్టినీ తనవైపుకు తిప్పుకుంది. తమిళం, హిందీ భాషల్లో చేసినా, తన ఫస్ట్ ప్రిఫరెన్స్ మాత్రం ఎప్పుడూ తెలుగుకేనంటోందీ భామ. ప్రస్తుతం ఈవిడగారు నటించిన దో లజోన్ కీ కహానీ సినిమా రిలీజ్ కు రెడీ గా ఉంది. ప్రపంచాన్ని చూడలేని ఒక అమ్మాయి ప్రేమలో పడితే అన్న కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా మేలో రిలీజవ్వబోతోంది. సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇంటర్వ్యూలో బాలీవుడ్ కు మీ ఓటా, లేక సౌత్ మూవీస్ కా అన్న ప్రశ్న ఎదురైనప్పుడు అలా స్పందించిందీ భామ. తనకు లైఫ్ ఇచ్చింది తెలుగు ఇండస్ట్రీ అని, అందుకే ఎప్పుడూ తన ప్రిఫరెన్స్ తెలుగుకే ఉంటుందని చెప్పుకొచ్చింది. అంతేకాదండోయ్. మన సినిమాలు రిచ్ గా, నీట్ గా ఉంటాయని, హీరోయిన్స్ ను ఇక్కడ బాగా చూసుకుంటారని చెబుతోంది. గతంలో ఇలియానా కూడా సేమ్ టు సేమ్ ఇదే రికార్డేసింది. ఆ తర్వాత బాలీవుడ్ కు చెక్కేసి, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ మీద కాంట్రవర్సీ కామెంట్స్ చేసింది. మరి కాజల్ అయినా మాట మీద నిలబడి ఉంటుందో లేదో చూద్దాం.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.