English | Telugu

రెండు రాష్ట్రాల సినిమాటోగ్రఫీ మినిస్టర్లను కలిసిన టాలీవుడ్‌ నిర్మాతలు!

గత కొన్ని రోజులుగా చిత్ర పరిశ్రమలో అనిశ్చితి నెలకొన్న విషయం తెలిసిందే. ఫిలిం ఛాంబర్‌, ఫిలిం ఫెడరేషన్‌ మధ్య వేతనాల సమస్య రోజురోజుకీ తీవ్రతరం అవుతోంది. దీని పరిష్కారం కోసం పలుమార్లు చర్చలు జరిగినా అవి సత్ఫలితాల్ని ఇవ్వలేదు. దీంతో ఆంధ్రప్రదేశ్‌ సినిమాటోగ్రఫీ మినిస్టర్‌ కందుల దర్గేశ్‌ను కలిసి సినీ పరిశ్రమలోని సమస్యలు, సినీ కార్మికుల ఆందోళనకు సంబంధించి ఒక వినతి పత్రాన్ని అందించారు నిర్మాతలు.

దీనిపై ఆంధ్రప్రదేశ్‌ సినిమాటోగ్రఫీ మినిస్టర్‌ కందుల దుర్గేశ్‌ మాట్లాడుతూ ‘సినీ పరిశ్రమలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు తెలియజేసేందుకు నిర్మాతలు వస్తామంటే రమ్మని చెప్పాం. అయితే దీనికి ప్రత్యేక ఎజెండా ఏమీ లేదు. ఈ సమస్యపై సినీ కార్మికులు, సినీ నిర్మాతలు.. ఇరువురు చెప్పే విషయాలు వింటాం. ఆ తర్వాత ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లి చర్చిస్తాం. ఒకవేళ ప్రభుత్వ జోక్యం అవసరం అనుకుంటే సీఎం, డిప్యూటీ సీఎంల స్థాయిలో నిర్ణయం తీసుకుంటారు. అయితే ఈ అంశంపై ఫెడరేషన్‌, ఫిలింఛాంబర్‌ సభ్యులు కలిసి కూర్చొని మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో చలన చిత్ర పరిశ్రమ అభివృద్దికి కట్టుబడి ఉన్నాం. సినిమా నిర్మాణానికి కావాల్సిన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తాం. ఏపీలో స్టూడియోలు, రీరికార్డింగ్‌ థియేటర్లు, డబ్బింగ్‌ థియేటర్లు నిర్మించేందుకు ముందుకు వస్తే ప్రభుత్వం తరఫున సహకారం అందిస్తాం’ అన్నారు. కందుల దుర్గేష్‌ను కలిసిన నిర్మాతల్లో బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌, కె.ఎల్‌.నారాయణ, డి.వి.వి.దానయ్య, రవిశంకర్‌, నాగవంశీ, భరత్‌, విశ్వప్రసాద్‌, చెర్రీ, సాహు గారపాటి, యువి క్రియేషన్స్‌ వంశీ, బన్నీ వాసు, వివేక్‌ కూచిభొట్ల తదితరులు ఉన్నారు.

మరోపక్క తెలంగాణ సినిమాటోగ్రఫీ మినిస్టర్‌ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కొందరు నిర్మాతలు కలిసి సమస్యను వివరించారు. ఈ సమావేశంలో ఎఫ్‌డిసి ఛైర్మన్‌ దిల్‌ రాజు, బాపినీడు, ఫిలిం ఛాంబర్‌ సెక్రటరీ దామోదర ప్రసాద్‌, సుప్రియ, జెమినీ కిరణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Dominic And The Ladies Purse Review: డొమినిక్ అండ్ ద లేడీస్ పర్స్ మూవీ రివ్యూ

సి.ఐ డొమినిక్ (మమ్ముట్టి) ప్రైవేట్ డిటెక్టివ్ గా చేస్తుంటాడు. అతడు గతంలో పోలీస్ ఆఫీసర్. ఇక అతనికి సహాయంగా ఉండేందుకు ఒక వ్యక్తి కావాలంటూ డొమినిక్ పేపర్ లో ప్రకటన ఇస్తాడు. దాంతో విక్కీ (గోకుల్ సురేశ్) అతడికి అసిస్టెంట్ గా  జాయిన్ అవుతాడు. ఒకరోజు డొమినిక్ ఉండే ఇంటి ఓనర్ మాధురి (విజీ వెంకటేశ్) అతని దగ్గరికి వచ్చి.. తను జనరల్ హాస్పిటల్ కి వెళ్లినప్పుడు ఒక 'పర్స్' దొరికిందని చెప్పి ఇస్తుంది. ఆ పర్స్ ఎవరిదో తెలుసుకుని వాళ్లకి అందజేయమని చెప్తుంది. దాంతో ఆ పర్స్ ఎవరిదో తెలుసుకునే పనిలో పడతాడు డొమినిక్. ఆ పర్స్ పూజ (మీనాక్షి ఉన్నికృష్ణన్) అనే యువతికి చెందినదని తెలుసుకుంటాడు. అయితే ఆ పర్స్ పారేసుకున్న రోజు నుంచి ఆమె మిస్సింగ్ అని తెలిసి షాక్ అవుతాడు...

హిందువులపై కాజల్ కీలక వ్యాఖ్యలు.. వైరల్ అవుతున్న పోస్ట్ 

అగ్ర హీరోయిన్ గా తెలుగు చిత్ర సీమని ఏలిన నటి కాజల్(Kajal). ఏలడమే కాదు దాదాపుగా అందరి అగ్ర హీరోలతో జతకట్టి తెలుగు చిత్రసీమలో తనకంటు ఒక అధ్యాయాన్ని సృష్టించుకుంది. పెర్ఫార్మ్ ఓరియెంటెడ్ నటిగా కూడా ఎన్నో చిత్రాల ద్వారా నిరూపించుకున్న కాజల్ పెళ్లి తర్వాత నటనకి దూరమవుతుందని అందరు అనుకున్నారు. కానీ ఆమె తన నట ప్రస్థానాన్ని కొనసాగిస్తు ఈ సంవత్సరం జూన్ 7 న 'సత్యభామ' అనే హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీతో మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ దేశంలో కొంత మంది అరాచక శక్తులు హిందువులు లక్ష్యంగా దాడులు చేస్తున్న విషయం తెలిసిందే.