English | Telugu

నాకు ఒక చరిత్ర ఉంది.. కెరీర్ లోనే ఫస్ట్ టైం రికార్డు వ్యూస్ 

మాస్ మహారాజ 'రవితేజ'(Ravi Teja)అప్ కమింగ్ మూవీ 'మాస్ జాతర'(Mass Jathara). యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా, ఈ నెల 27 న వరల్డ్ వైడ్ గా విడుదల కానుంది. చిరంజీవితో కలిసి వాల్తేరు వీరయ్య తర్వాత రవితేజ చేసిన చిత్రాలు రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు, ఈగల్, మిస్టర్ బచ్చన్ అంతగా అలరించక పోవడంతో 'మాస్ జాతర'తో అయినా, తమ అభిమాన హీరో భారీ హిట్ ని అందుకోవాలని అభిమానులు కోరుతున్నారు. రవితేజ సరసన శ్రీలీల(Sreeleela)జత కడుతుండగా నూతన దర్శకుడు భాను బోగవరపు(Bhanu Bogavarapu) తెరకెక్కించాడు.

రీసెంట్ గా మాస్ జాతర నుంచి టీజర్ రిలీజయ్యింది. నిమిషం ముపై సెకన్ల నిడివితో ఉన్న టీజర్ చూస్తుంటే మూవీలో రవితేజ ఎనర్జీ ఒక లెవల్లో ఉండబోతుందని అర్ధమవుతుంది. ఒక క్యారక్టర్ రవితేజ గురించి చెప్తు 'తను చేసే ఫైర్ డిపార్ట్మెంట్ లో తప్ప అన్ని డిపార్ట్మెంట్స్ లో వేలు పెడతాడని చెప్పించడం, శ్రీలీలతో రవితేజ చెప్పిన డైలాగులు చూస్తుంటే ప్రేక్షుకులకి ఈ సారి ఫుల్ మీల్స్ గ్యారంటీ అని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా నాకంటూ ఒక చరిత్ర ఉందని రవితేజ చెప్పిన డైలాగ్ అభిమానులని విశేషంగా ఆకరిస్తుంది. ఫైట్స్ సరికొత్తగా డిజైన్ చేసారని అర్ధమవుతుండటంతో పాటు, విజువల్ గా ఛాయాగ్రాహకుడు విధు అయ్యన్న కెమెరా పనితనం మెస్మరైజ్ చేయనుందని తెలుస్తుంది.

అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్ , ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ సంయుక్తంగా మాస్ జాతర ని నిర్మించగా, రాజేంద్ర ప్రసాద్(Rajendraprasad)తో పాటు మరికొంత మంది సినీ ప్రముఖులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. భీమ్స్ సిసిరోలియో((Beems sisirolio)సంగీత దర్శకత్వంలో ఇప్పటికే విడుదలైన రెండు పాటలకి అద్భుతమైన స్పందన లభించింది. టీజర్ విడుదలైన నిమిషాల్లోనే రవితేజ గత చిత్రాల టీజర్స్ కంటే రికార్డు వ్యూస్ ని రాబడుతుంది.


అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.