English | Telugu

రష్మీ తామర పువ్వు ఎవరికి ఇస్తుందో.. సుధీర్ అన్న ఎక్కడ?

బుల్లితెర మీద జబర్దస్త్ యాంకర్ ఎవరంటే రష్మీ గౌతమ్ మాత్రమే గుర్తొస్తుంది. ఇక ఈమె శ్రీదేవి డ్రామా కంపెనీని కూడా హోస్ట్ చేస్తూ ఉంది. అలాంటి రష్మీ ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ పెట్టింది. ఒక దొప్పలో కూర్చుని పింక్ కలర్ లో ఉన్న తామర పువ్వును ఎవరికో ఇస్తూ సిగ్గుపడుతున్న పిక్స్ ని పోస్ట్ చేసింది. "ఈ తామర పువ్వు నీకు..అరచేతిలో దాచుకునే ముఖం నాకు..నేను నా పింక్ సాక్స్...క్రేజి మార్నింగ్, క్రేజి మెమోరీస్" అంటూ ఒక పింక్ తామర పువ్వును ఎవరికో ఇస్తున్నట్టు కనిపించింది యాంకర్ రష్మీ. ఇక ఈ పిక్స్ చూసిన నెటిజన్స్ ఐతే "ఆ ప్రకృతి అందం అంతా మీలోనే ఉంది.

పువ్వుతో ఒక ఏంజెల్, ఎంత క్యూట్ గా ఉందొ రష్మీ గౌతమ్, సుధీర్ అన్న ఎక్కడ, ఒక ఫ్రేమ్ లో రెండు తామర పువ్వులు, మీరు మేకప్ లేకుండా నే బాగున్నారు మేడం, రష్మీ అక్క మీరు నేచురల్ బ్యూటీ...నీకు తామర పువ్వు ఇస్తున్నది ఎవరు ? తామర పువ్వు కూడా ఈర్ష పడుతుంది మేడం మిమ్మల్ని చూసి " అంటూ కామెంట్స్ చేశారు. రష్మీ గౌతమ్ బుల్లితెర మీద సుధీర్ తో కలిసి ఎన్నో షోస్ ని హోస్ట్ చేసింది. దాంతో ఈ జోడికి విపరీతమైన ఫాలోయింగ్ వచ్చింది. వీళ్ళు పెళ్లి చేసుకుంటే బాగుండు అనుకునే ఆడియన్స్ కూడా ఉన్నారు. ఐతే తర్వాత వీళ్ళు ఎవరికీ వారు విడిపోయి వేరే వేరే షోస్ కి వెళ్లిపోయారు. ఇప్పుడు రష్మీ జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీని హోస్ట్ చేస్తోంది. సుధీర్ మాత్రమే మూవీస్ లో నటిస్తున్నాడు అలాగే జీ సరిగామప చేస్తున్నాడు. అలాగే ఇంకొన్ని షోస్ కి గెస్ట్ గా వెళ్తున్నాడు.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.