English | Telugu

నాగ్ కళ్యాణ్ జ్యూయలర్స్ యాడ్ షూటింగ్ రేపే

నాగ్ కళ్యాణ్ జ్యూయలర్స్ యాడ్ షూటింగ్ రేపే ప్రారంభం కానుంది. వివరాల్లోకి వెళితే కేరళకు చెందిన కళ్యాణ్ రామ్ జ్యూయలర్స్ సంస్థ తమ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా, యువసామ్రాట్, అక్కినేని నాగార్జునను ఎంచుకుంది. ఇప్పటికే కళ్యాణ్ జ్యూయలర్స్ సంస్థ ఒక యాడ్ ని నాగార్జునతో షూట్ చేసి తమ నగల అమ్మకాలకు పబ్లిసిటీ జరుపుకుంటోంది. ఆ యాడ్ బాగా వర్కవుట్ కావటంతో నాగార్జునతో మరో యాడ్ ను కూడా ఆకర్షణీయంగా తయారుచేసి, మొత్తం సౌతిండియన్ మార్కెట్ ను తమ చేతుల్లోకి తీసుకోటానికి సన్నాహాలు చేస్తూంది.

ఆ ప్రయత్నంలో భాగంగా రేపు అంటే జూన్ 9 వ తేదీన తమిళనాడులోని పళనిలోకల శ్రీసుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయంలో అక్కినేని నాగార్జునతో కొత్త యాడ్ ను చిత్రీకరించనుంది. ఈ యాడ్ లో నటించిన అనంతరం తను హీరోగా నటిస్తూ నిర్మిస్తున్న "రాజన్న" సినిమా షూటింగ్ లోనూ, ఆర్ ఆర్ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న భారీ సోషియో ఫాంటసీ చిత్రం "ఢమరుకం"లోనూ నాగార్జున షూటింగులో పాల్గొంటారు.

రూమర్స్ కి చెక్.. ఉస్తాద్ భగత్ సింగ్ గురించి మొత్తం చెప్పేసింది

సిల్వర్ స్క్రీన్ పై పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)స్టామినాని మరింతగా ఎలివేట్ చెయ్యబోతున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad.ఇప్పటి వరకు రిలీజైన ప్రచార చిత్రాల ద్వారా ఆ విషయం అర్ధమవుతుండటంతో పాటు దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఆ విషయంలో అభిమానులకి, ఫ్యాన్స్ కి పూర్తి భరోసాని ఇస్తున్నాడు. వచ్చే ఏడాది వేసవికి థియేటర్స్ లో అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా గురించి ప్రముఖ హీరోయిన్ సాక్షి వైద్య చెప్పిన కొన్ని విషయాల ద్వారా ఎప్పట్నుంచో సినీ సర్కిల్స్ లో దర్జాగా చక్కర్లు కొడుతున్న ఒక పుకారు కి  పుల్ స్టాప్ పడినట్లయింది.