English | Telugu

బిగ్గెస్ట్ హిట్స్ @ 2015

చిత్రసీమ‌లో విజ‌యాల వాటా ఎప్పుడూ ప‌దిశాత‌మే! వంద సినిమాలొస్తే.. అందులో హిట్టు అనిపించుకొనేవి ప‌ది మాత్ర‌మే! ఈయేటి ఫ‌లితాల స‌ర‌ళి గ‌మ‌నించినా ఇలానే సాగింది. ఇప్ప‌టి వ‌ర‌కూ... దాదాపుగా 170 చిత్రాలు విడుద‌ల‌య్యాయి. వాటిలో హిట్లు చూస్తే 19 మాత్ర‌మే క‌నిపించాయి. క‌నీసం ఓ అర‌డ‌జ‌ను యావ‌రేజులుగా మిగిలాయి.

* భ‌ళా బాహుబ‌లి

సూప‌ర్ హిట్ బ్లాక్ బ్ల‌స్ట‌ర్ బొనాంజా బాహుబ‌లి రూపంలో ద‌క్కింది. ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ చిత్రం దాదాపుగా రూ.550 కోట్లు వ‌సూలు చేయ‌గ‌లిగింది. తెలుగు చ‌ల‌న చిత్ర‌సీమ క‌నీవినీ ఎరుగ‌ని వ‌సూళ్లు ఇవీ.. 80 యేళ్ల తెలుగు సినీ చ‌రిత్ర‌లో ఇదో అద్భుత‌మైన విజ‌యం. బాహుబ‌లి హ‌వా తెలుగునాట మాత్ర‌మే కాదు.. త‌మిళ సీమ‌లోనూ క‌నిపించింది. హిందీలో వంద కోట్లు సాధించిన తొలి ప్రాంతీయ చిత్రంగా రికార్డులు కొల్ల‌గొట్టింది. ఇంత కంటే..బిగ్గెస్ట్ హిట్ ఏముంటుందిక‌??

* శ్రీ‌మంతుడి జోరు

బాహుబ‌లి రికార్డుల‌తో పోలిస్తే... మిగిలిన తెలుగు సినిమాల‌న్నీ చాలా త‌క్కువ‌గానే క‌నిపిస్తాయ్‌. కానీ.. వాటినీ త‌క్కువ అంచ‌నా వేయ‌కూడ‌దు. బాహుబ‌లి త‌ర‌వాత వ‌చ్చిన శ్రీ‌మంతుడు దాదాపుగా రూ.150 కోట్ల గ్రాస్ వ‌సూలు చేసింది. టాప్ 2గా నిలిచింది. మ‌హేష్ చిత్రాల్లో వంద కోట్లు సాధించిన తొలి చిత్ర‌మిది. వ‌సూళ్ల‌లో టాప్ 2 తెలుగు చిత్రం. ఒక యేడాదిలో ఈ రెండు చిత్రాల‌తో దాదాపు రూ.700 కోట్ల వ‌సూళ్లు ద‌క్కాయంటే..తెలుగు సినిమా ఏ స్థాయికి ఎదిగిందో అర్థం అవుతోంది.

* భ‌లే భ‌లే లాభాలోయ్‌

చిన్న సినిమాల్లో సునామీ లాంటి వ‌సూళ్లు సాధించిన చిత్రం భ‌లే భ‌లే మ‌గాడివోయ్‌. రూ.8 కోట్ల‌తో తీసిన ఈ చిత్రానికి దాదాపు రూ.35 కోట్లు వ‌చ్చాయి. అంటే నాలుగు రెట్లు లాభాల‌న్న‌మాట‌. బాహుబ‌లి లాభాల శాతంతో పోలిస్తే.. భ‌లే భ‌లే మ‌గాడివోయ్‌కే ఎక్కు వ ద‌క్కిన‌ట్టు. ఓవ‌ర్సీస్‌లో ఈ సినిమా దుమ్ముదులిపింది. మ‌హేష్ బాబు సినిమాకి ఎన్ని వ‌సూళ్లు వ‌స్తాయో.. అన్ని వ‌సూళ్లు ఈ సినిమాకి ద‌క్కాయి. మారుతికి త‌న‌పై ప‌డిన బూతు ముద్ర ఈ సినిమా తొల‌గించింది. నానిని స్టార్ ని చేసింది.

* చిన్న చిత్రాల జోరు

కుమారి 21 ఎఫ్ వ‌సూళ్లు కూడా ప‌రిశ్ర‌మ వ‌ర్గాల్ని ఆశ్చ‌ర్య ప‌రిచాయి. యువ‌త‌రం సినిమా అనే ముద్ర ప‌డడం ఈ సినిమాకి బాగా క‌లిసొచ్చింది. రూ.3 కోట్ల‌తో తెర‌కెక్కించిన ఈ చిత్రం రూ.12 కోట్లు ద‌క్కించుకొంది. రాజుగారి గ‌దికీ రెట్టింపు లాభాలొచ్చాయి. సినిమా చూపిస్త మావ రూ.10 కోట్ల క్ల‌బ్‌లో చేరింది. దాంతో ఈ యేడాది చిన్న చిత్రాల విజ‌యంగా మారిపోయింది.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.