English | Telugu

ఆదర్శగ్రామంగా తీర్చిదిద్దుతానంటున్న శ్రీమంతుడు..!

బుర్రిపాలెంను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానన్నారు ప్రముఖ సినీనటుడు మహేశ్. బుర్రిపాలెంను దత్తత తీసుకున్న సందర్భంగా ఆయన మొదటిసారి గ్రామానికి వచ్చారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సూపర్‌స్టార్ మాట్లాడారు. బుర్రిపాలెంకు రావడం చాలా ఆనందంగా ఉందన్నారు. రాజకుమారుడు చిత్రం సమయంలో ఈ గ్రామానికి వచ్చానని, మళ్లీ, ఇప్పుడు తన గ్రామానికి రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. తన నాయనమ్మ, నాన్న, బాబాయిలకు బుర్రిపాలెం అంటే చాలా ఇష్టమని, ఊరి కోసం వారు చాలా చేశారని..ఈ కార్యానికి వాళ్లే స్పూర్తే అన్నారు.

శ్రీమంతుడు సమయంలోనే బావ గల్లా జయదేవ్ ఈ గ్రామాన్ని తనను దత్తత తీసుకోమన్నారు. తాను చేస్తున్న చిత్రం కూడా దత్తత గ్రామం అనే అంశంతో ఉండటంతో, బుర్రిపాలెంను దత్తత తీసుకుంటే కనుక పబ్లిసిటీ కోసమని అందరూ అనుకుంటారని, ఈ చిత్రం విడుదలైన తర్వాత దత్తత తీసుకుంటానని చెప్పినని అన్నారు. గల్లా జయదేవ్ తాను దత్తత తీసుకున్న గ్రామాన్ని ఏ విధంగా అయితే డెవలప్ చేశారో చూశానని, చాలా ఇన్ స్పైరింగ్‌గా ఉందని అన్నారు. గ్రామాన్ని అభివృద్ధి చేయడమంటే రోడ్లు, రంగులు వేయడం కాదని మహేశ్ వ్యాఖ్యానించారు. ఇకపై ఇక్కడకు మళ్లీ మళ్లీ వస్తానన్నారు.

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.