English | Telugu

చెప్పుల పోస్టర్‌తో సరిపెట్టిన మహేశ్ అండ్ టీం

సూపర్ స్టార్ మహేశ్-శ్రీకాంత్ అడ్డాల కాంభినేషన్‌లో తెరకెక్కుతున్న మూవీ బ్రహ్మోత్సవం. ఫస్ట్‌లుక్‌తోనే సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేశాడు ప్రిన్స్. సినిమాపై క్రేజ్ తగ్గకుండా చూసేందుకు దర్శక నిర్మాతలు టీజర్‌ల మీద టీజర్‌లతో దాడి చేస్తారు. బ్రహ్మోత్సవం విషయంలో అప్పుడెప్పుడో సంక్రాంతికి వదిలిన ఫస్ట్‌లుక్ తప్ప మరేమి లేదు. దీనిని గ్రహించిన మూవీ టీం ఉగాది పండుగ నాడు ఓ స్పెషల్ టీజర్ విడుదల చేస్తామని చెప్పింది. కానీ టీజర్‌కు బదులు కేవలం ఒక పోస్టర్‌‌ని విడుదల చేసింది. వైట్ కలర్ సూట్ వేసుకున్న మహేశ్ ఎవరికో చెప్పులు తొడుగుతున్నట్టుగా మరో క్యారెక్టర్‌ని ఇంట్రడ్యూస్ చేసే యత్నం చేశారు. టీజర్ రీలిజ్ చేస్తారనుకుంటే పోస్టర్‌తో సరిపెట్టడంతో అభిమానులు నిరాశ పడ్డారు.

అయితే పోస్టర్ వెనుక చాలా స్టోరీ నడిచిందని ఫిల్మ్‌నగర్ టాక్ . బ్రహ్మోత్సవం ఔట్‌పుట్‌‌పై ఇప్పటికే చాలా అనుమానాలున్నాయంట. డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల మూవీ మేకింగ్‌పై..మహేశ్ అసంతృప్తిలో ఉన్నాడని ఇండస్ట్రీ టాక్. ఇప్పుడు టీజర్ ఇస్తామని చెప్పి ఇవ్వలేకపోవడం అంటే అది ఖచ్చితంగా ప్లానింగ్ లేకపోవడమే. సినిమా కూడా అనుకున్న మేర కంప్లీట్ కాలేదని చెప్పుకుంటున్నారు. టీజర్‌నే టైంకి ఇవ్వలేనపుడు..సినిమాను అనుకున్న సమయానికి విడుదల చేయడం కష్టమనే టాక్ వినిపిస్తోంది.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.