English | Telugu

కరేబియన్ దీవిని కొనేసిన మహేష్ బాబు..!

సూపర్ స్టార్ మహేశ్ ..ప్రస్తుతం టాలీవుడ్‌ టాప్ హీరోల్లో ఒకడు. సినిమాలతో పాటు యాడ్స్‌లోనూ నటిస్తూ రియల్ లైఫ్‌లోనూ శ్రీమంతుడిగా మారిపోయాడు. సినిమాకి, డబ్బుకి ఎంత విలువిస్తాడో, అంతకంటే ఎక్కువ ఇంపార్టెన్స్ ను కుటుంబానికి ఇస్తాడు సూపర్ స్టార్. షూటింగ్ లేదంటే ఫ్యామిలీతో గడపడానికే ప్రిఫరెన్స్ ఇస్తాడు. సాధారణంగా మహేష్ లాంటి సెలబ్రిటీలకు ఇండియాలో ప్రైవసీ దొరకదు. అందుకే కుటుంబంతో సహా ఫారిన్ చెక్కేసి, అక్కడే కాస్త హాయిగా రిలాక్స్ అయి వస్తుంటారు. అయితే ఇప్పుడు మహేష్ తనకోసం పూర్తిగా ఒక సొంత ప్లేస్ ను ఫారిన్ లో కొనుక్కుంటున్నారట. కుటుంబంతో సహా ప్రతీ ఏడాదీ వెకేషన్లో గడపడం కోసం, కరీబియన్ ఐలాండ్స్ దగ్గర ఒక ప్రైవేట్ దీవిని కొనుక్కుంటున్నాడట. దాదాపు 12 కోట్లు పెట్టి ఈ దీవిని శ్రీమంతుడు సొంతం చేసుకున్నాడని వార్తలు వస్తున్నాయి. దీవితో పాటు, అక్కడే అన్ని వసతులూ ఉన్న పెద్ద భవంతి, స్విమ్మింగ్ పూల్, టెన్నిస్ కోర్ట్ లాంటి అన్ని సౌకర్యాలు అక్కడ ఉంటాయట. శ్రీమంతుడు తలచుకుంటే సాధించలేనిదేముంటుంది..?

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.