English | Telugu

విలన్ గా సుధీర్ బాబు బాగున్నాడండోయ్

బాహుబలి ప్రభాస్ కెరీర్లోనే మర్చిపోలేని సూపర్ హిట్ వర్షం. దీన్ని హిందీలో బాఘీ పేరుతో రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. టైగర్ ష్రాఫ్, శ్రద్ధా కపూర్ హీరో హీరోయిన్లు గా నటించారు. లేటెస్ట్ గా రిలీజైన ఈ సినిమా ట్రైలర్ చూస్తే మనకు ఒక డౌట్ రాక మానదు. ఇది తెలుగు వర్షం సినిమానేనా అని. కేవలం సినిమాలోని బేసిక్ లైన్స్ ను తీసుకుని, మిగిలిన సెటప్ అంతా బాలీవుడ్ కు తగ్గట్టు మార్చారు. ఇంకా చెప్పాలంటే, చైనా సినిమా రేంజ్ లో మార్చేశారు. ఆ మార్షల్ ఆర్ట్స్, బిల్డింగ్ నిండా రౌడీలు గట్రా చూస్తే, ఇదేదో బ్రూస్ లీ సినిమాలా ఉందే అనిపించక మానదు.

ఇందులో విలన్ గా మన తెలుగు హీరో సుథీర్ బాబును తీసుకున్నారు. బాఘీ కోసం మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడంతో పాటు, సుధీర్ బాబు తన శరీరాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుకున్నాడు. " ఎక్కడో బాలీవుడ్ లోని ఒక ఛాలెంజింగ్ రోల్ కోసం వెతుకుతూ ఒక తెలుగోడిని తీసుకుపోయారు. మనం ఎవరికీ తక్కువ కాదు " అంటూ ట్వీట్ చేశాడు సుధీర్ బాబు. ట్రైలర్ చూసిన వాళ్లు కూడా హీరో కంటే విలనే బాగున్నాడంటూ ప్రశంసలు కురిపించడం విశేషం. కానీ వర్షం అనేది ఒక ఫీల్ గుడ్ గా అనిపించే ప్రేమకథ. బాఘీ ట్రైలర్లో మాత్రం అలాంటి సూచనలేమీ కనబడలేదు. సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి మరి.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.