English | Telugu

బెల్లంకొండకు భారీగా దొరికాయి..!

టాలీవుడ్ ను వేధిస్తున్న థియేటర్ల కొరత సమస్య బెల్లంకొండకు మాత్రం ఎదురు కాలేదు. నాగార్జున లాంటి స్టార్లకు సైతం 600 థియేటర్లు మాత్రమే లభిస్తుంటే, బెల్లంకొండ సురేష్ కొడుకు సాయి శ్రీనివాస్ ' స్పీడున్నోడు ' మాత్రం, భారీగా 800 థియేటర్లు దక్కించుకుంది. పెద్దగా స్టార్ ఇమేజ్ లేని శ్రీనివాస్ కు ఇంత భారీగా థియేటర్లు రావడం టాక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది.

' స్పీడున్నోడు ' శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా 800 థియేటర్లలో సందడి చేయబోతోంది. నైజాంలో 180, రాయలసీమలో 100, ఆంధ్రాలో 270 థియేటర్లలో ఈ మూవీ రిలీజ్ అవుతోంది.ఇవే కాక కర్ణాటకలో 75, తమిళనాడులో 30, రెస్టాఫ్ ఇండియా 80 స్క్రీన్స్ లో రిలీజ్ చేస్తున్నారు. ఓవర్సీస్ లో సైతం దాదాపు 50 స్క్రీన్స్ ‘స్పీడున్నోడు’కి ఇవ్వడం విశేషం. టోటల్ గా చూస్తే, దాదాపు 800 థియేటర్లలో ఈ తన సినిమాను రిలీజ్ చేస్తున్నాడు దర్శకనిర్మాత భీమనేని. ఐతే, ఎంత భారీగా రిలీజ్ అయినా, సినిమా రన్ మాత్రం దాని పెర్ఫామెన్స్ మీదే ఆధారపడి ఉంటుదన్న మాట వాస్తవం. మరి స్పీడున్నోడు ఎలా రాబోతున్నాడో,జనాన్ని ఎలా అలరిస్తాడో చూడాలి..

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.