Read more!

English | Telugu

బెల్లంకొండకు భారీగా దొరికాయి..!

టాలీవుడ్ ను వేధిస్తున్న థియేటర్ల కొరత సమస్య బెల్లంకొండకు మాత్రం ఎదురు కాలేదు. నాగార్జున లాంటి స్టార్లకు సైతం 600 థియేటర్లు మాత్రమే లభిస్తుంటే, బెల్లంకొండ సురేష్ కొడుకు సాయి శ్రీనివాస్ ' స్పీడున్నోడు ' మాత్రం, భారీగా 800 థియేటర్లు దక్కించుకుంది. పెద్దగా స్టార్ ఇమేజ్ లేని శ్రీనివాస్ కు ఇంత భారీగా థియేటర్లు రావడం టాక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది.

' స్పీడున్నోడు ' శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా 800 థియేటర్లలో సందడి చేయబోతోంది. నైజాంలో 180, రాయలసీమలో 100, ఆంధ్రాలో 270 థియేటర్లలో ఈ మూవీ రిలీజ్ అవుతోంది.ఇవే కాక కర్ణాటకలో 75, తమిళనాడులో 30, రెస్టాఫ్ ఇండియా 80 స్క్రీన్స్ లో రిలీజ్ చేస్తున్నారు. ఓవర్సీస్ లో సైతం దాదాపు 50 స్క్రీన్స్ ‘స్పీడున్నోడు’కి ఇవ్వడం విశేషం. టోటల్ గా చూస్తే, దాదాపు 800 థియేటర్లలో ఈ తన సినిమాను రిలీజ్ చేస్తున్నాడు దర్శకనిర్మాత భీమనేని. ఐతే, ఎంత భారీగా రిలీజ్ అయినా, సినిమా రన్ మాత్రం దాని పెర్ఫామెన్స్ మీదే ఆధారపడి ఉంటుదన్న మాట వాస్తవం. మరి స్పీడున్నోడు ఎలా రాబోతున్నాడో,జనాన్ని ఎలా అలరిస్తాడో చూడాలి..