Read more!

English | Telugu

నందమూరి ఫ్యామిలీతో పూరీ అటాచ్ మెంట్

పూరి జగన్నాథ్ పల్లీలు తిన్నంత ఈజీగా సినిమాలు తీసేస్తాడన్న సంగతి అందరికీ తెలిసిందే..కానీ హీరోలకు కథలు చెప్పి ఒప్పించడంలో కూడా పూరి స్టైల్ డిఫరెంట్ అని తాజాగా ప్రూవ్ చేసుకున్నాడు. విషయంలోకి వెళ్తే, టాలీవుడ్ లో ఒక హీరోకి కథ చెప్పి ఒప్పించడమంటే మాటలు కాదు.కానీ పూరీ ఒకేసారి నందమూరి అన్నదమ్ములైన ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లకు కథలు చెప్పి ఇద్దరితోనూ చెరో రెండు సినిమాలను ఓకే చేయించాడు.కళ్యాణ్ రామ్ తో సినిమా చేయబోతున్నానని ప్రకటించిన పూరి, ఆ తర్వాత తారక్ తో కూడా ఒక సినిమా చేయబోతున్నాడని సమాచారం.గతేడాది పూరి ఎన్టీఆర్ తో టెంపర్ తీసి హిట్ కొట్టిన సంగతి తెలిసిందే..

ప్రస్తుతం జనతా గ్యారేజ్ తో బిజీగా ఉన్న తారక్, అది పూర్తవ్వగానే, పూరీతో సినిమా మొదలెడతాడట.తన చివరి రెండు సినిమాలు యావరేజ్ గా వెళ్లిపోయినా డిజప్పాయింట్ అవ్వకుండా, వరసగా సినిమాలు చేసుకుంటూ పోతున్న పూరీ,నిజంగానే సూపర్ ఫాస్ట్.కళ్యాణ్ రామ్ తో చేయబోతున్న సినిమా, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లోనే ఏప్రిల్ లో మొదలవుతుంది.మరి జూ.ఎన్టీఆర్ సినిమాను కూడా ఇదే బ్యానర్ పై నిర్మిస్తారా లేక వేరే ప్రొడ్యూసర్ కు అవకాశమిస్తారా అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ గానే ఉంది..చిరు 150 వ సినిమా ఛాన్స్ పోయిన తర్వాత, నందమూరి ఫ్యామిలీతో పూరి అటాచ్ మెంట్ పెరగడం విశేషం.