English | Telugu

శింబు నడిగర్ సంఘాన్ని వదలి వెళ్లద్దు..!

వివాదాస్పద తమిళ నటుడు శింబు, నడిగర్ సంఘం తాను బాధల్లో ఉన్నప్పుడు ఆదుకోలేదని, అందుకు సభ్యత్వానికి రాజీనామా చేయానుకుంటున్నానంటూ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై నడిగర్ సంఘం అధ్యక్షుడు నాజర్, కార్యదర్శి విశాల్ స్పందించారు. సంఘం నుంచి శింబు బయటికెళ్లడం తమకు ఇష్టం లేదని విశాల్ వ్యాఖ్యానించారు. శింబు మాత్రమే కాదు, ఏ సభ్యుడు బయటికి వెళ్లినా తమకు ఇష్టం లేదని, వీలైనంత న్యాయం చేయడం కోసమే సంఘం ఉందని విశాల్ అన్నారు. నిజానికి బీప్ సాంగ్ వివాదం సమయంలో, తాము శింబు తండ్రి టి రాజేందర్ ను కలిశామని, సమస్యను చట్టరీత్యా ఎదుర్కొంటామని వారు చెప్పడంతోనే నడిగర్ సంఘం ఈ విషయంలో తలదూర్చలేదని నాజర్ అన్నారు. ఈ నెల 24న జరగబోయే కార్యవర్గ సమావేశంలో అందరితో చర్చించి ఆ తర్వాత తమ నిర్ణయం ప్రకటిస్తామని, తమకు శింబు డైరెక్ట్ గా ఏమీ చెప్పలేదని, తాము కూడా మీడియా ద్వారానే తెలుసుకున్నామని నాజర్ చెప్పడం విశేషం. శింబును వెళ్లకుండా ఆపడానికే ప్రయత్నిస్తామని ఆయన అన్నారు. నాజర్, విశాల్ వ్యాఖ్యలకు శింబు స్పందించాల్సి ఉంది.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.