English | Telugu

హృతిక్ రోషన్ కు 3000 మెయిల్స్ పంపిందట..!

బాలీవుడ్ బ్రేకప్ కాంట్రవర్సీ కపుల్ హృతిక్, కంగనాల మధ్య వివాదం రోజురోజుకూ ముదురుతున్న సంగతి తెలిసిందే. హృతిక్ తనను మోసం చేశాడని కంగనా చెబుతుంటే, తనను మెయిల్స్ తో కంగనా టార్చర్ చేసిందని హృతిక్ చెబుతున్నాడు. దీంతో ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకునే వరకూ వెళ్లింది. చాలా మంది బాలీవుడ్ పెద్దలు ఈ వ్యవహారాన్ని సాగదీయకుండా ఉంటే మంచిదని వీళ్లకు నచ్చచెప్పారు కూడా. తాజాగా హృతిక్ తప్పు లేదని ముంబై సైబర్ క్రైమ్ పోలీసులు తేల్చి చెప్పేశారు. హృతిక్ అఫీషియల్ ఈ మెయిల్ నుంచి కంగనాకు ఒక్క మెయిల్ కూడా వెళ్లలేదని, ఆమెకు మెయిల్స్ పంపిన ఐడీ ఎవరో నకిలీ వ్యక్తిదని పోలీసులు చెబుతున్నారు. hrroshan@gmail.com అకౌంట్ నుంచి కంగనాకు మెయిల్స్ వచ్చాయని, కానీ ఆ ఎకౌంట్ హృతిక్ ది కాదని కుండ బద్ధలుగొట్టేశారు. కంగనా నుంచి మాత్రం హృతిక్ కు ఆరునెలల్లో మూడు వేల మెయిల్స్ వెళ్లాయని పోలీసులు చెప్పడం విశేషం. ఏడేళ్లలో హృతిక్ మొబైల్ నుంచి కంగనాకు కేవలం నాలుగు కాల్స్ మాత్రమే వెళ్లాయని, ఆమెను కలవడానికి హృతిక్ ప్యారిస్ వెళ్లాడన్నదానిలో కూడా నిజం లేదని పోలీసులు కొట్టి పారేశారు. దీంతో ఈ మొత్తం వివాదంలో హృతిక్ క్లీన్ గా బయటపడతాడంటున్నాయి బాలీవుడ్ వర్గాలు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.