English | Telugu

శింబు మెంబర్ షిప్ ను వదిలేశాడు...!

తమిళ నడిగర్ సంఘం ఎన్నికలు సినిమాల్ని మించి రసపట్టులో నడిచాయి. అందరూ సినిమా వాళ్లే అయినా, ఒకరిపై ఒకరు ఆరోపణలు, తిప్పికొట్టడాలు చేసుకున్నారు. శరత్ కుమార్, విశాల్ ల మధ్య గడ్డి వేయకపోయినా మంటలు వచ్చేంత గొడవలు జరిగిపోయాయి. చివరికి విశాల్ అండ్ కో గెలిచి కొత్త ఆఫీస్ ను క్రియేట్ చేశారు. అంతా ప్రశాంతంగా ఉందనుకున్న సమయంలో తమిళ హీరో శింబు మరో వివాదాస్పద పని చేశాడు. శింబు ఎన్నికల్లో శరత్ కుమార్ కు మద్దతు పలకడమే కాక, అప్పట్లో కొన్ని సంచలన వ్యాఖ్యలు కూడా చేశాడు. ఈ మధ్య కాలంలో పోలీసులు కేసులు అంటూ బిజీగా ఉన్న శింబు, మళ్లీ నడిగర్ సంఘం వైపుకు రాలేదు.

కానీ ఏమైందో ఏమో, సడెన్ గా తన నడిగర్ సంఘం సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానంటూ ప్రకటించాడు. తాను కష్టాల్లో ఉన్నప్పుడు ఏ సాయం చేయని నడిగర్ సంఘం లో తనకు సభ్యత్వం ఉంటే ఎంత..లేకపోతే ఎంత అంటున్నాడు శింబు. కానీ బీప్ సాంగ్ లాంటి పాటతో వివాదాస్పదమైంది శింబు నే. అతని పాటకు మహిళా సంఘాలు కేసులు పెడితే ఇబ్బంది పడిన విషయం అందరికీ తెలిసిందే. మరి అలాంటి చోట్ల ఏ సంఘమైనా ఎలాంటి మద్దతు ఇవ్వగలదు అంటూ నడిగర్ సంఘం ప్రస్తుత సభ్యులు ప్రశ్నిస్తున్నారు. ఇవి కాకపోయినా మిగిలిన వివాదాలన్నీ కూడా శింబుకు వ్యక్తిగతమైనవే. మరి ఈ వివాదాల్లో తనకు మద్దతు ఇవ్వలేదని సాకు చూపి సభ్యత్వానికి శింబు ఎందుకు రాజీనామా చేశాడనేది ఇప్పుడు తమిళ సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.