English | Telugu

డైరెక్టర్ అవుతున్న గ్రేట్ స్టంట్ డైరెక్టర్..!

కణల్ కణ్ణన్. ఒకప్పుడు ఫైట్స్ అని వినిపస్తే ఈ పేరు కూడా వినబడేది. స్టంట్స్ డిజైన్ చేయడంలో కణల్ కణ్ణన్ ది అంత ప్రత్యేకమైన శైలి. దక్షిణ భారత స్టంట్ డైరెక్టర్స్ లో ఆల్ టైం టాప్ 5 లో గ్యారంటీగా ఉంటాడు. ఇప్పుడు ఈ స్టంట్ డైరెక్టర్, దర్శకుడిగా మారుతున్నాడు. కొరియోగ్రాఫర్లు, కేమేరా మన్లు, నిర్మాతలు డైరెక్టర్స్ అవుతున్నారు కాబట్టి, కణల్ కణ్ణన్ నిర్ణయంలో పెద్ద ఆశ్చర్యం లేదు. కణల్ హీరో గోపీచంద్ కు కథ చెప్పి, ఒప్పించాడట. పూర్తి యాక్షన్ తో, మాస్ ఎంటర్ టైనర్ కథతో, గోపీని మెప్పించాడట. కథ బాగా నచ్చి గోపీచంద్ కూడా సై అనడంతో, త్వరలోనే వీళ్లిద్దరి మూవీ ట్రాక్ ఎక్కే అవకాశం ఉందట. ప్రస్తుతం ఎఎం రత్నం తనయుడు జ్యోతికృష్ణ రూపొందిస్తున్న ఆక్సిజన్ సినిమాలో బిజీగా ఉన్నాడు గోపీచంద్. అది పూర్తవ్వగానే కణ్ణన్ సినిమా తెరకెక్కే అవకాశం ఉంది. గతంలో కొరియోగ్రాఫర్ అమ్మ రాజశేఖర్ డైరెక్షన్లో గోపీచంద్ రణం లాంటి సూపర్ హిట్ ను అందుకున్న విషయం తెలిసిందే.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.