English | Telugu

సరైనోడు రీషూట్ కి కారణం అదేనా..?

ఆడియో సక్సెస్ మీట తర్వాతి రోజే సరైనోడు రీషూట్ చేస్తున్నారంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. సినిమాను చిరుకు చూపించారని, ఆయన చెప్పిన కరెక్షన్ల గురించే సినిమాను రీషూట్ చేయబోతున్నారంటూ మాట్లాడుకున్నారు. కానీ ఈ రీషూట్ పర్వం వెనుక సెన్సార్ బోర్డ్ కూడా ఉందట. మామూలుగానే బోయపాటి సినిమా అంటే వయలెన్స్ ఎలా ఉంటుందో చెప్పక్కర్లేదు. ట్రైలర్లో సినిమాలోని హింసపాళ్లను కొద్దిగా చూపించాడు కూడా. దీంతో సినిమా వయలెన్స్ కారణంగా ఏ సర్టిఫికేట్ ఇస్తామని, ఒకవేళ తాము చెప్పిన సీన్స్ ను తొలగిస్తే యూ బై ఏ ఇస్తామని సెన్సార్ వాళ్లు అన్నారట.

ఒక సీక్వెన్స్ లో ఎడిటింగ్ చేసుకున్న సినిమాకు మధ్యలో సీన్స్ కట్ చేస్తే, అతుకుల బొంతలా తయారవుతుంది సినిమా. ఇప్పటికే బన్నీ కూడా u/a సర్టిఫికేట్ సినిమా ఇది అంటూ ఆడియో సక్సెస్ మీట్ లో ప్రకటించేశాడు. దాంతో ఎలా అయినా ఆ సర్టిఫికెట్ కోసం, సినిమా సీక్వెన్స్ సీన్స్ చెడిపోకుండా, కొద్దిగా మార్చి రీషూట్ చేస్తున్నారట. ఎలాగూ టైం ఉంది కాబట్టి, రీషూట్ చేసి పెర్ఫక్షన్ తోనే హాల్లోకి ఎంటరౌదామని ఫిక్సయ్యారట. అదండీ రీషూట్ వెనక అసలు విషయం. రీషూట్ అయిన తర్వాత మళ్లీ సెన్సార్ బోర్డుకు చూపించేసి 22వ తారీఖున హాల్స్ లో హల్ చల్ చేయబోతున్నాడు అల్లు అర్జున్.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.