English | Telugu

పేరు మార్చుకుని బాలీవుడ్ కు చెక్కేసింది..!

సినీఫీల్డ్ లో పాపం కొంతమంది ఎంత ప్రయత్నించినా, సక్సెస్ రాదు. పేర్లు మార్చుకున్నా, ఫీల్డ్ మార్చుకున్నా సక్సెస్ చాలా కష్టమవుతుంటుంది. తెలుగు ఇండస్ట్రీలో చాలా కాలం నుంచీ అవకాశాల కోసం ప్రయత్నిస్తోంది మధురిమ. అందాల ఆరబోతకు కూడా ఏమాత్రం అడ్డు చెప్పని ఈ భామకు అవకాశాలు అంతంతమాత్రంగానే వచ్చాయి. ఐటెం సాంగ్స్ లో ఊపేసినా, రాంచరణ్ లాంటి స్టార్ తో కలిసి ఆరెంజ్ లో నటించినా బ్రేక్ రాలేదు. మొన్నీమధ్యే టెంపర్ లో సైడ్ క్యారెక్టర్ కూడా వేసింది. ఇక తెలుగులో కష్టమే అనుకుందో ఏమో గానీ, నైరా బెనర్జీగా పేరు మార్చుకుని బాలీవుడ్ లో ప్రయత్నాలు చేస్తోంది మధురిమ. సన్నీ లియోన్ లీడ్ రోల్ లో వస్తున్న వన్ నైట్ స్టాండ్ సినిమాలో కీలకపాత్ర పోషిస్తోంది. ఇక నుంచీ నైరా బెనర్జీ అన్న పేరుతోనే, బాలీవుడ్ లో అవకాశాలు కొట్టాలని ట్రై చేస్తోంది మధురిమ. వన్ నైట్ స్టాండ్ సినిమా, పూర్తి స్థాయి అడల్ట్ కంటెంట్ ఉండే సినిమా. ఇలాంటి సినిమాలకు ఇప్పుడు అక్కడ బాగానే ఆదరణ లభిస్తోంది కాబట్టి, మధురిమ కూడా సన్నీ తరహాలో సెటిల్ అయిపోతుందేమో మరి..

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.