English | Telugu

స‌ర్దార్‌... వాళ్ల‌ని కొనేశాడా?

ఓ సినిమా విడుద‌ల అవుతోందంటే చాలు.. చిత్రబృంద‌మంతా ఎలెర్ట్ అయిపోతుంది. పాజిటీవ్ రివ్యూలు ఎలా రాబ‌ట్టుకోవాలా అని స్కెచ్చులు గ‌ట్రా గీస్తుంటుంది. టాలీవుడ్ లోని వెబ్ మీడియాలో కొంత‌మందిని బాగానే కంట్రోల్ చేసి, త్రీ స్టార్స్‌, ఫోర్ స్టార్స్ సంపాదించేస్తుంటారు. అయితే... ఈమ‌ధ్య ఆ స్ట్రాట‌జీ మారింది. బాలీవుడ్ విమ‌ర్శకుల్ని కూడా మెప్పించి, వాళ్లను ఏదోలా ఒప్పించి.. సినిమాకి ముందు రోజే పాజిటీవ్ రివ్యూలు తెచ్చుకోవ‌డ‌మ‌నే ఆన‌వాయితీ మొద‌లైంది. బాహుబ‌లికి అదే జ‌రిగింది. బాహుబ‌లి రేపు రిలీజ్ అన‌గా.. ఈరోజు నుంచే అక్కడి విమ‌ర్శకులు సినిమా సూప‌ర్‌, కేక అదిరిపోయింది అంటూ సోష‌ల్ మీడియాలో స్టేట్‌మెంట్లు గుప్పించ‌డం మొద‌లెట్టారు. దాంతో.. పాజిటీవ్ టాక్ బాగా పెరిగి.. ఓపెనింగ్స్ అద‌రిపోయాయి.

ఇప్పుడు స‌ర్దార్ గ‌బ్బర్ సింగ్‌కీ అదే స్ట్రాట‌జీ వాడేశారు. సినిమా రిలీజ్‌కి రెండ్రోజుల ముందే..అక్కడి విమ‌ర్శకులు స‌ర్దార్‌ను ప్రత్యేకంగా చూపించారు. వాళ్లేమో.. ఇంతోటి సినిమా బాలీవుడ్‌లోనే రాలేదు, ఈ సినిమా వంద కోట్లు దాటేస్తుంది... రికార్డులు బ‌ద్దలు కొట్టేస్తుంద‌ని ట్వీట్లు చేసి హోరెత్తించారు. అవి చూసిన వాళ్లంతా నిజంగా స‌ర్దార్‌లో అంత విష‌యం ఉండే ఉంటుంది అని భ్రమ‌ప‌డి ముందే అడ్వాన్స్ బుకింగ్‌లు చేయించుకొన్నారు.

తీరా ఇప్పుడు సినిమా చూస్తే.. స‌గ‌టు ప‌వ‌న్ అభిమాని సైతం.. ఇదేం సినిమారా బాబూ.. అంటూ త‌ల‌బాదుకొంటున్నాడు. ఇలాంటి క‌ళాఖండాన్నా బాలీవుడ్ వాళ్లు అద్భుతం అమోఘం అంటూ పొగిడేశారు అనిపిస్తోంది. ఇదంతా చూస్తుంటే.. కావాల‌ని, బాలీవుడ్ విమ‌ర్శ‌కుల్ని కూడా మేనేజ్ చేయ‌గ‌లిగారా అన్న అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి. ఏదోలా పాజిటీవ్ టాక్ తెచ్చేస్తే.. తొలి మూడు రోజులూ వ‌సూళ్ల‌తో గ‌ట్టెక్కేసేద్దామ‌న్న ఉద్దేశంతో బాలీవుడ్ విమ‌ర్శ‌కుల్ని స‌ర్దార్ టీమ్ కొన్నా కొనేయొచ్చు... అన్న మాట‌లూ వినిపిస్తున్నాయి. వీటిలో నిజం ఎంతో తెలీదుగానీ... తొలిసారి అక్క‌డి విశ్లేష‌కుల‌పై అనుమానాల మేఘాలు క‌మ్ముకొన్నాయి. మున్ముందూ ఇలాంటి పిచ్చి పిచ్చి పాజిటీవ్ బ‌చ్‌లు ఇస్తుంటే వాళ్ల మాట‌ల్నీ ఎవ్వ‌రూ న‌మ్మ‌రిక‌.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.