English | Telugu

సర్దార్ లో కాజల్ కు ఎందుకు మైనస్ మార్కులు..?

సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా టాక్ తో పాటు, మూవీలో కాజల్ లుక్స్ గురించి కూడా డివైడ్ టాకే వచ్చింది. మొన్నటి వరకూ అందంగా చందమామలా కనిపించిన కాజల్ లో, ఒక్కసారిగా మార్పు వచ్చేసిందంటూ ప్రేక్షకులు భావించారు. రాజకుమారిగా కాజల్ అసలు సెట్ కాలేదంటూ, చాలా మంది విమర్శిస్తున్నారు కూడా. అసలు కాజల్ లో ఎందుకు సడెన్ గా అంత ఛేంజ్ కనిపించింది..? అని అడిగితే, ఆమె సన్నబడటమే అనే సమాధానం వస్తుంది. సినిమా రిలీజ్ కు ముందే వచ్చిన కాజల్ ఫస్ట్ లుక్ చూడగానే, సన్నబడినట్టుందే అనే ఫీల్ వచ్చింది. ఆల్రెడీ ఈ చందమామ సన్నమే. నాజూకైన శరీరాకృతి, మంచి గ్లో ఉన్న ముఖం కాజల్ కు ప్లస్ పాయింట్స్. అవే ఆమెకు అవకాశాల్ని కూడా తెచ్చిపెట్టాయి.

కానీ తను లావైపోయిందని ఎవరైనా చెప్పారో, లేక తనే అనుకుందో తెలీదు గానీ, ఒక్కసారిగా అమ్మడు డైటింగ్ చేసి స్లిమ్ గా మారిపోయింది. దాంతో ముఖంలో కాంతి వాడిపోయింది. ఇదే సర్దార్ లో కాజల్ కు మైనస్ అయిందంటున్నారు సినీజనాలు. స్లిమ్ అవడానికి ట్రై చేసిన ప్రతీ హీరోయిన్ నూ తెలుగు ఆడియన్స్ రిజెక్ట్ చేశారు. తెలుగు తమిళ ప్రేక్షకులకు, హీరోయిన్ కాస్త బొద్దుగా ఉంటేనే నచ్చుతుంది. శ్రియ, ఇలియానా, త్రిష, ఛార్మి ఇలా చాలా మంది హీరోయిన్స్ ను కాస్త ఒళ్లు ఉన్నప్పుడే ఆదరించారు. వీళ్లందరూ సన్నబడగానే అవకాశాలు తగ్గిపోయాయనే విషయం సినీజనాలకు బాగా తెలుసు. ఇప్పుడు సర్దార్ పై ఎన్నో హోప్ప్ పెట్టుకున్న కాజల్ కూడా సినిమాకు మైనస్ లలో ఒకటిగా మారిపోవడం విచిత్రం. మరి ఈ భామ మళ్లీ అవకాశాలను దక్కించుకుంటుందో లేదో చూడాలి.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.